టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మహేష్ బాబుకి అందరు హీరోల అభిమానులు ఫాన్స్ గా ఉన్నారు. ఆయనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ భారీగా ఉన్న సంగతి తెలిసిందే. దీనితో మహేష్ బాబుతో సినిమా చేస్తే చాలు నష్టాలు రావు లాభాలే అని దర్శక నిర్మాతలు ఎక్కువగా భావిస్తూ ఉంటారు. ఈ మధ్య వరుస విజయాలతో మహేష్ బాబు దూసుకుపోతున్నాడు. భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు... ఇలా వరుస హిట్లు కొడుతూ ఎవరికి అందని రేంజ్ లో ఉన్నాడు సూపర్ స్టార్. 

 

దీనితో నిర్మాతలు ఇప్పుడు మహేష్ తో సినిమా చేయడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వాస్తవం. దీనినే మహేష్ బాబు ఆసరాగా చేసుకుని వారిని ఇబ్బంది పెడుతున్నాడని అంటున్నారు. సాధారణంగా మహేష్ బాబుతో సినిమా అంటే ఎక్కువ పారితోషకం ఇవ్వాలని తెలుసు. కాని మహేష్ బాబు ఇప్పుడు పారితోషకం తీసుకోవడం మానేసాడు. మహర్షి సినిమా నుంచి ట్రెండ్ పూర్తిగా మార్చేశాడు మహేష్ బాబు. సినిమా విడుదలకు ముందు జరిగే మార్కెట్ మొత్తం నాకే అంటున్నాడు. దానికి తోడు నేను నిర్మాతగా ఉంటా అని కండీషన్ కూడా పెడుతున్నాడు. 

 

ఈ రోజుల్లో సినిమా విడుదలకు ముందు జరిగే మార్కెట్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. సినిమా విడుదల అయిన తర్వాత వచ్చిన వసూళ్ళ కంటే కూడా సినిమా విడుదలకు ముందు వచ్చే హక్కుల సొమ్మే ఎక్కువగా ఉంటుంది. అది అంతా నాకు ఇవ్వాలని మహేష్ బాబు కండీషన్ పెడుతున్నాడు. దీనితో దర్శక నిర్మాతలు ఇప్పుడు మహేష్ తో సినిమా అనగానే దాదాపు గా డ్రాప్ అయిపోయే పరిస్థితి వచ్చింది. దిల్ రాజు మహేష్ తో సినిమా చేయడానికి గాను మంచి కథ తీసుకుని వెళ్తే మహేష్ డిమాండ్ దెబ్బకు ఆయన దిమ్మ తిరిగిందని ఒక వెబ్ సైట్ కథనం కూడా ప్రచురించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: