రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో బాలీవుడ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది. జనవరి 26న సాహో హిందీ వెర్షన్ ను జీ సినిమా తొలిసారి టీవిలో ప్రసారం చేయగా రికార్డు స్థాయిలో 128.20 లక్షల వ్యూవర్ షిప్ ఇంప్రెషన్స్ ను రాబట్టుకుందని బార్క్ (బి ఎ ఆర్ సి ) వెల్లడించింది. తద్వారా బాలీవుడ్ లో హైయెస్ట్ టీఆర్పీ ని రాబట్టిన 5వ సినిమా గా సాహో రికార్డు సృష్టించింది. ఈజాబితాలో కేసరి మొదటి స్థానంలో ఉండగా 2.0,టోటల్ ఢమాల్, హౌస్ ఫుల్ 4 తర్వాతి స్థానాల్లో వున్నాయి.
అయితే టీవి ప్రీమియర్ కు కొన్ని నెలల ముందే
సాహో హిందీ వెర్షన్
నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన కూడా ఈరేంజ్ లో రేటింగ్స్ ను రాబట్టడం మాములు విషయం కాదు. దాంతో
ఇండియా లో
ప్రభాస్ కు ఎలాంటి క్రేజ్ వుందో మరోసారి బయటపడింది. గత ఏడాది విడుదలైన
సాహో తెలుగు తో పాటు మిగితా దక్షిణాది భాషల్లో డిజాస్టర్ అవ్వగా
హిందీ లో మాత్రం 150 కోట్లు రాబట్టి సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక
బాహుబలి తో
హిందీ ప్రేక్షకులకు దగ్గరైన
ప్రభాస్ ,సాహో తో అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు.
ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం తన 20వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఓ డియర్ అనే టైటిల్ పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొద్ది రోజుల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా యువీ క్రియేషన్స్ ,గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు తోపాటు ఈ చిత్రం తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.