సీనియర్ నటుడు సుమన్ గురించి మన తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. మహారాష్ట్రకు చెందిన సుమన్, తన అందం, ఆకట్టుకునే నటనతో తెలుగులో కూడా అప్పట్లో హీరోగా టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో మంచి పేరు దక్కించుకున్నారు. మొదటగా ఇద్దరు ఖిలాడీలు, త్రివేణి సంగమం అనే సినిమాలతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన సుమన్, ఆ సినిమాల ద్వారా మంచి పేరు దక్కించుకుని, అక్కడి నుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ హీరోగా ముందుకు సాగారు. అయితే మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన పలు కేసుల్లో ఇర్రుకున్నారు సుమన్. ఇక అదే సమయంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మంచి ఫేజ్ లో కొనసాగుతున్నారు. 

 

ఓవైపు సుమన్ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నప్పటికీ, మరోవైపు చిరు మాత్రం అతి పెద్ద విజయాలు అందుకుంటూ టాలీవుడ్ కి మెగాస్టార్ గా అద్భుతమైన పేరుని గడించారు. ఇక అప్పట్లో సుమన్ కు వస్తున్న అవకాశాలను చిరు లాగేసుకున్నారని, దాని వలన సుమన్ మూవీ కెరీర్ పెద్దగా ముందుకు సాగలేదని కొన్ని వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే వాటిని సుమన్ కానీ, చిరంజీవి కానీ ఎప్పుడూ పెద్దగా లక్ష్య పెట్టలేదు. కానీ ఇటీవల మాత్రం ఆ వార్తలు మరింతగా ప్రచారం అవుతుండడంతో ఒక ఇంటర్వ్యూ లో సుమన్ మాట్లాడుతూ, 

 

అప్పట్లో తనకు అవకాశాలను చిరు చేజిక్కించుకుని కెరీర్ పరంగా తనకు నష్టం చేకూర్చారని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, అవి కేవలం రూమర్స్ మాత్రమేనని, కెరీర్ పరంగా ఎవరికి వస్తున్న సినిమాలు వారు చేసుకుంటూ ముందుకు సాగామని సుమన్ క్లారిటీ ఇచ్చారు. అలానే ఈ విషయమై ఇటీవల ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ సుమన్, చిరంజీవిల మ్యాటర్ అప్పట్లో ఎంతో వైరల్ అయిందని, అయితే అది ఎవరో కొందరు గిట్టని వాళ్ళు చిరంజీవి ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి అవి సృష్టించారని, ఆ విధంగా సుమన్ ని తొక్కేసింది చిరంజీవే అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని ఆయన కొట్టిపారేశారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: