జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలను మరియు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ తన రాజకీయ జీవితాన్ని మరియు సినీ జీవితాన్ని ఒకే తాటిపై నడిపిస్తున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలు ఖరారు చేసుకున్న పవన్ ప్రస్తుతం పింక్ సినిమా రీమేక్ అయిన లాయర్ సాబ్ మరియు క్రిష్ జాగర్లమూడి తో ఒక సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పరిణామాలు వేడెక్కడంతో ఇటు అమరావతి లో కూడా సగం సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తర్వాత సినిమాపై చర్చ మొదలవగా అందుకు సంబంధించిన సంకేతాలు వెలువడ్డాయి.

 

పవన్ ను దర్శకుడు బాబి ఒక కథతో దగ్గర అయ్యారని మరియు దానికి పవన్ నో చెప్పగా హీరో రామ్ అదే కథకు బాబీకి 'ఎస్' చెప్పాడని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో 'ఫైటర్' సినిమా చేస్తున్న పూరి జగన్నాథ్ పవన్ కు తాజాగా ఒక కథను వినిపించారట. దాదాపు అరడజను సినిమాలు వరుస ఫ్లాపులతో వెనుకబడ్డ పూరి 'ఇస్మార్ట్ శంకర్' లాంటి భారీ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇదే ఊపులో పవన్ కు ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ వినిపించి దానిని ఓకే చేసుకున్నాడు అని సమాచారం

 

ఇప్పటికే పవన్ తో బద్రి మరియు కెమెరామెన్ గంగతో రాంబాబు లాంటి అరుదైన చిత్రాలు చేసినా పూరి మంచి యాక్షన్ సన్నివేశాలు ఉన్న చిత్రాన్ని పవర్ స్టార్ కోసం రెడీ చేశాడట. పవన్ సినిమాని ఎంత సీరియస్ గా తీసుకున్నాడు అన్న విషయం కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. అయితే రాజకీయాల్లో అవిరామంగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్తుకి కూడా ఉపయోగపడే మంచి సందేశాత్మక చిత్రాలు చేసే ఉద్దేశంలో ఉండగా పూరి లాంటి బోల్డ్ డైరెక్టర్ తో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: