ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు విశాఖ, అమరావతి కేంద్రంగానే నడుస్తున్నాయి అనేది వాస్తవం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం దెబ్బకు ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు కూడా. రాజకీయ౦గా ఏమో గాని అమరావతి మార్పు అనేది చాలా మందిని ఆర్ధికంగా దెబ్బ కొట్టిన మాట వాస్తవం. ఎందరో అమరావతి రాజధానిగా ఉంటుంది అని భావించి భూములు కొనుగోలు చేసారు. కాని అమరావతి కాదు రాజధాని మారుస్తున్నారనే విషయం తెలిసిన తర్వాత దాని మీద జగన్ అధికారిక ప్రకటన చేసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు కూడా. 

 

వారిలో చాలా మంది సిని నటులు కూడా ఉన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందని భావించి చాలా మంది భూములు కొనుగోలు చేసారు. కాని ఇప్పుడు అది లేకపోవడంతో షాక్ అయ్యారు. అంతకు ముందు విశాఖలో తమకు ఉన్న భూములను అమ్మకుని అమరావతిలో కొనుగోలు చేసారు. ఇప్పుడు ఏమో విశాఖ రాజధాని అని ప్రభుత్వం అంటుంది. దీనితో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. ఎం చెయ్యాలో చాలా మందికి అర్ధం కావడం లేదని టాక్. వందల ఎకరాలను సినీ నటులే కొనుగోలు చేసారని వ్యాఖ్యలు వినపడుతున్నాయి.

 

వారిలో అనుష్క కూడా ఉంది. అనుష్క గతంలో తనకు ఉన్న విశాఖ భూములను వదులుకుని అమరావతిలో కొనుక్కుంది. అప్పుడు లక్షలు పలికిన విశాఖ భూములు ఇప్పుడు కోట్లకు చేరాయి. ఎక్కడ చూసినా సరే ఇదే పరిస్థితి ఉంది. దీనితో అనుష్క బాధపడుతుంది. రాజధాని మార్పు అనేది ఊహించని పరిణామం అని ఇప్పుడు అమరావతి భూములను కొనుగోలు చేయడానికి కూడా ఎవరూ ముందుకి రావడం లేదని తన సన్నిహితుల వద్ద ఆమె వాపోయినట్టు సమాచారం. తాను చాలా ఆర్ధికంగా రాజధాని మార్పుతో ఇబ్బంది పడుతున్నాను అని పలువురి వద్ద చెప్పినట్టు సమాచారం. అప్పుడు తనను చూసి తన స్నేహితులు కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టారట.

మరింత సమాచారం తెలుసుకోండి: