‘అల వైకుంఠపురములో’ మూవీ ఇండస్ట్రీ హిట్ గా మారడంతో త్రివిక్రమ్ జూనియర్ తో చేయబోయే సినిమా ఏ కథతో ఉంటుంది అన్న విషయమై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అయితే తారక్ నటిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు కాని విడుదల అవ్వని పరిస్థితులలో జూనియర్ త్రివిక్రమ్మూవీ ప్రారంభం అవ్వాలి అంటే వచ్చే ఏడాది మార్చి వరకు ఆగాలి.


దీనితో త్రివిక్రమ్ కు సంవత్సరం కాలం వరకు గ్యాప్ ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితులలో ఈ గ్యాప్ మధ్య త్రివిక్రమ్ ఒక మిడిల్ రేంజ్ హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం త్రివిక్రమ్ ఆలోచనలలో నాని శర్వానంద్ నితిన్ లు ఉన్నట్లు సమాచారం. 


అయితే త్రివిక్రమ్ కు బాగా తెలిసిన హీరోలతోనే సినిమాలు చేసే అలవాటు ఉంది. దీనితో ఇప్పటికే నితిన్ తో ‘అ ఆ’ మూవీ చేసిన సాన్నిహిత్యం ఉండటంతో నితిన్ వైపు మొగ్గు చూపుతాడా అన్న అంచనాలు కూడ ఉన్నాయి. ఈ అంచనాలకు మరింత బలం చేకూరుస్తు ఇప్పుడు త్రివిక్రమ్ రేపు జరగబోతున్న ‘భీష్మ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా రాబోతు ఉండటంతో మళ్ళీ నితిన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతోందా అన్న సందేహాలు వస్తున్నాయి. 


నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకుని భారీ విజయమే లక్ష్యంగా నటిస్తున్న ‘భీష్మ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రేపు యూసఫ్ గుడా లోని పోలీసు గ్రౌండ్స్ లో జరగబోతోంది. సాధారణంగా టాప్ హీరోల సినిమా ఫంక్షన్స్ జరిగే ఓపెన్ గ్రౌండ్ లో నితిన్ ‘భీష్మ’ ఫంక్షన్ జరుగుతూ ఉండటంతో నితిన్ ఫంక్షన్ కు అంతమంది అభిమానులు వస్తారా అంటూ చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. ఎప్పటికీ మిడిల్ రేంజ్ హీరోగా కొనసాగకుండా మరొక మెట్టు ఎక్కాలని నితిన్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ ‘భీష్మ’ ఎంత వరకు సహకరిస్తుందో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: