వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో నితిన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. శనివారం నితిన్‌ పెళ్లి పనులను లాంచనం గా ప్రారంభించారు. ప్రస్తుతం భీష్మా సినిమా ప్రమోషన్‌ లో బిజీగా ఉన్న నితిన్‌, ఆ సినిమా రిలీజ్‌ అయిన వెంటనే పూర్తిగా పెళ్లి పనుల మీద దృష్టి పెట్టనున్నాడు. శనివారం తనకు కాబోయే భార్యతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియా లో పోస్ట్ చేశాడు నితిన్. ఈ ఫోటోలపై ఆసక్తికర రిప్లై లు వస్తున్నాయి. యంగ్‌ హీరోలు నాని, నవదీప్‌, కార్తికేయలు నితిన్‌ ను టీజ్ చేస్తూ కామెంట్ చేశారు.

 

హీరోయిన్‌ రష్మిక కూడా నితిన్‌ పెళ్లి పై ఆసక్తికర కామెంట్ చేసింది. `శుభాకాంక్షలు నితిన్‌ సార్‌... చూడండి నేను మీకు లక్కీ. నేను కలిసాకే మీకు పెళ్లి అవుతోంది.` అంటూ సరదాగా కామెంట్ చేసింది రష్మిక. ప్రస్తుతం నితిన్‌, రష్మికలు భీష్మా సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఛలో వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

 

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు నితిన్‌. అయితే ఇప్పుడు చంద్రశేఖర్ సినిమా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్‌ 15, 16 తారీఖుల్లో నితిన్‌, షాలినీల వివాహం జరగనుంది. దీంతో సినిమాలకు నితిన్‌ షార్ట్ బ్రేక్‌ ఇస్తాడన్న ప్రచారం జరుగుతోంది. మరి నిజంగానే నితిన్‌ బ్రేక్‌ తీసుకుంటాడా..? లేక పెళ్లి పనులతో పాటు సినిమా పనులు కూడ చక్కెబెడతాడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: