ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో తన 27వచిత్రంలో నటించడానికి ఓకే చెప్పాడు. పవన్ లేకుండానే కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక ఈసినిమా కొత్త షెడ్యూల్ మంగళవారం నుండి జరుగనుంది. ఈషెడ్యూల్ లో పవన్ జాయిన్ కానున్నాడు. సుమారు 100కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాక్వలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించనున్నారట. ఈ ఏడాది చివర్లో ఈసినిమా విడుదలకానుంది. ఈ రెండు సినిమాలను పూర్తి చేసి
పవన్ ,హరీష్
శంకర్ తో తన తదుపరి
సినిమా చేయనున్నాడు. మైత్రి
మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకానుంది.