రెండేళ్లు  సినిమాలకు దూరంగా వున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రీ ఎంట్రీ ని ఘనంగా చాటుకున్నాడు. అందులో భాగంగా  ప్రస్తుతం పవన్ .. ఎంసీఏ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో  పింక్ రీమేక్ లో నటిస్తున్నాడు. సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు. ఈసినిమా కు వకీల్ సాబ్ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే 30శాతం షూటింగ్ కూడా పూర్తయింది. యువ హీరోయిన్లు అంజలి, నివేత థామస్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ఎస్ ఎస్ థమన్  సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం కోసం పవన్ 20రోజుల డేట్స్ ఇచ్చాడట అంతేకాదు ఈ 20రోజులకు సుమారు 50కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని టాక్. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్  బోనీ కపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మే లో విడుదలకానుంది.
 
ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో తన  27వచిత్రంలో నటించడానికి ఓకే చెప్పాడు. పవన్ లేకుండానే కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక ఈసినిమా కొత్త షెడ్యూల్ మంగళవారం నుండి జరుగనుంది. ఈషెడ్యూల్ లో పవన్ జాయిన్ కానున్నాడు. సుమారు 100కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాక్వలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటించనున్నారట. ఈ ఏడాది చివర్లో ఈసినిమా విడుదలకానుంది. ఈ రెండు సినిమాలను పూర్తి చేసి పవన్ ,హరీష్ శంకర్ తో తన తదుపరి సినిమా చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: