మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా.. తనకంటూ ఓ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పర్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వరుస సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన ఈయన ఇటీవలే జనసేన పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారారు. అయితే అక్కడ సరైన సక్సెస్ రాకపోవడంతో మళ్లీ సిల్వర్ స్క్రీన్పై అలరించడానికి రెడీ అయ్యారు. అయితే మొన్నటి వరకు ఒక్క సినిమా చేస్తే చాలు అనుకున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. కానీ ఇప్పుడు మాత్రం ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. వాటిలో ఇటీవలే పింక్ రీమక్స్ సెట్స్ పైకి వచ్చేసిన పవన్ కళ్యాణ్.. ఆ వెంటనే క్రిష్ దర్శకత్వంలో సినిమాకు ముహూర్తం పెట్టేసి మరో సినిమాను లైన్లో పెట్టారు.
ఇదిలా ఉండగానే మూడో సినిమాను కూడా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అయ్యారు. ఇక ఈ మూడు సినిమాలు పూర్తయ్యే సమయంలోనే మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాలని పవన్ ఫిక్స్ అయ్యారట. ఈ మేరకు టాప్ డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ కథలు కూడా సిద్ధం చేస్తున్నారని ఇన్సైడ్ టాక్. ఇవన్నీ పక్కన పెడితే.. టాలీవుడ్లో సినిమాలు నిర్మిస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో సినిమా పక్కాగా ఉంటుందని అన్నారు. సరైన కథ, సరైన దర్శకుడు దొరకకపోవడం వల్లనే ఈ మూవీ ఆలస్యమవుతూ వస్తోందని, అతి త్వరలోనే రామ్ చరణ్తో సినిమా పట్టాలెక్కుతుందని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలేక్కనుందని తెలుస్తోంది. దీనికి దర్శకుడు బాబీ అన్నట్టుగా చర్చ నడుస్తోంది. మరి ఇదే నిజమైతే అబ్బాయితో, బాబాయ్ సినిమా త్వరలోనే ఉండనుంది. మరియు దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్తో పాటు ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్తో రామ్ చరణ్ సినిమా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.