హాట్‌ హాట్‌ వీడియోలతో సోషల్‌ మీడియాలో వేడి పెంచే హాట్ బ్యూటీ పూనమ్‌ పాండే, ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త, బిజినెస్‌ మేన్‌ రాజ్‌ కుంద్ర, అతని టీం పై బాంబే హైకోర్టులో కేసు వేసింది. రాజ్‌ కుంద్రాతో పాటు అతని సహచరులు పూనమ్‌ పాండే నటించిన కొన్ని వీడియోలను ఆమె అనుమతి లేకుండా వాడుతున్నారని ఆమె ఆరోపిస్తోంది. గతంలో ఒక ఓ కార్యక్రమం కోసం రాజ్‌ కుంద్రా, పూనమ్‌లు కలిసి పనిచేశారు. అయితే కాంట్రక్ట్ ముగిసిన తరువాత కూడా తనకు సంబంధించిన వీడియోలను వారు వాడుతున్నారని ఆమె ఆరోపించింది.

 

అయితే ఈ వార్తలను రాజ్‌ కుంద్రతో పాటు ఆయన సహచరుడు సౌరభ్‌ కుష్వా ఖండించారు. తమకు ఎలాంటి నోటీసులు అందలేదని వారు వెల్లడించారు. రాజ్‌ కుంద్ర ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్మ్‌ స్ప్రైమ్‌ మీడియా అనే సంస్థతో గతంలో పూనమ్‌ పాండే తన యాప్‌ను నిర్వహించేందుకు డీల్‌ కుదుర్చుకుంది. అయితే ఆ కాంట్రక్ట్‌ ముగిసిన ఎనిమిది నెలల తరువాత కూడా రాజ్‌ కుంద్ర టీం యాప్‌ కోసం తీసుకున్న తన వీడియో కంటెంట్‌ను వాడుతున్నారని ఆరోపిస్తోంది.

 

అంతేకాదు ఆ వీడియోల ద్వారా రాజ్‌ కుంద్ర పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నారని పూనమ్‌ అంటోంది. తాను ఈ విషయంలో చట్టపరమైన పోరాటం మొదలు పెట్టిన దగ్గర నుంచి తనకు అభ్యంతర కాల్స్‌ వస్తున్నాయంటూ ఆమె కంప్లయింట్‌లో తెలిపింది. అంతేకాదు `అతను నిజంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే నేను అతని డబ్బు సాయం చేస్తాను అంతేకానీ ఆయన్న వీడియోలో అనుమతి లోకుండా వాడొద్దని కోరుతున్న` అంటూ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో వెల్లడించింది పూనమ్‌ పాండే. అంతేకాదు ఆ వీడియోలతో పాటు తన పర్సనల్ ఫోన్‌ నంబర్‌ను కూడా కుంద్ర కంపెనీ బహిర్గతం చేసినట్టుగా ఆమె ఆరోపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: