జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ మొఖానికి రంగేసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ పింక్ రీమేక్ లో ప‌వ‌న్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ఇంత వ‌ర‌కు ఇలా ఉంటే ఇటీవ‌ల శ‌ర్వానంద్ - స‌మంత జంట‌గా వ‌చ్చిన జాను సినిమా రిజ‌ల్ట్ ఇప్పుడు ప‌వ‌న్ పింక్‌ను భ‌య‌పెట్టేస్తోంద‌ట‌.



వాస్త‌వానికి జాను త‌మిళ్‌లో మంచి హిట్ అయ్యింది. ఈ సినిమాను తెలుగు లో రైట్స్ తీసుకుని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా దిల్ రాజు రీమేక్ చేశారు. ఇది ఎమోషనల్‌ వ్‌స్టోరీ కావడంతో దిల్‌ రాజు ఈ చిత్రం ఖచ్చితంగా వర్కవుట్‌ అవుతుందని అనుకున్నాడు. ఇంకా చెప్పాలంటే శర్వానంద్ కంటే స‌మంత న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. అయితే ఈ సినిమా ఓవ‌ర్ బ‌డ్జెట్ అవ్వ‌డం.. ఇక్క‌డ ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ కాక‌పోవ‌డంతో ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయ్యింది.



స‌మంత లాంటి మంచి న‌టీమ‌ణి ఉన్నా.. టాక్ బాగున్నా అక్క‌డ హిట్ అయిన సినిమా రీమేక్ చేయ‌డం వ‌ల్లో ఏమోగాని ఇక్క‌డ జాను ఆడ‌లేదు. ఇప్పుడు ఇదే టెన్ష‌న్ ప‌వ‌న్ పింక్ రీమేక్ కు కూడా ప‌ట్టుకుంది. వాస్త‌వంగా చూస్తే పింక్ కూడా చాలా త‌క్కువ మందికి క‌నెక్ట్ అయ్యే క‌థ‌, క‌థ‌నంతో ఉంటుంది. ఈ సినిమాకు వంద కోట్ల బిజినెస్‌ లెక్కలు  వేసుకుని కూర్చున్నారు. అది కానీ రివర్స్‌ అయితే ఇక అంతే సంగతులు.



ఈ సినిమాను ఇప్ప‌టికే చాలా మంది చూసేశారు. పైగా ప‌వ‌న్ ఈ సినిమా చేయ‌డం కూడా చాలా మందికి న‌చ్చ‌డం లేదు. అలాంటి సీరియ‌స్ పాత్ర‌లు ప‌వ‌న్ కు సూట్ కావ‌డం డౌటే. ఈ సినిమా కోస‌మే దిల్ రాజు ప‌వ‌న్‌కు ఏకంగా రు. 40 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చాడంటున్నారు. మ‌రి రాజు నమ్మ‌కం ఏంటో ఆయ‌న‌కే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: