టాలీవుడ్ ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ గా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు చిరంజీవి. ఆరు పదుల వయస్సులో కూడా తనదైన నటనతో, డ్యాన్సులతో, డైలాగులతో కోట్ల సంఖ్యలో అభిమానులను చిరంజీవి సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి చిత్రపరిశ్రమలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలను పరిష్కరిస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 
 
చిరంజీవి శుభకార్యాలకు హాజరైతే ఎక్కువగా తన భార్య సురేఖతో కలిసి హాజరవుతూ ఉంటారు. చిరంజీవి సురేఖ జంటగా గతంలో మీడియా ఛానెళ్లకు ఎప్పుడూ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. తాజాగా ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన చిరంజీవి సురేఖ తమ జీవితంలోని ఆసక్తికర విషయాల గురించి ఇంటర్వ్యూలో వెల్లడించారు. చిరంజీవి తనకు సురేఖను ఇచ్చి పెళ్లి చేసే సమయంలో అల్లు రామలింగయ్య తన గురించి చాలామందిని ఆరా తీశారని చెప్పారు. 
 
అప్పుడే సినిమా ఇండస్ట్రీలో కెరీర్ మొదలుపెట్టాను కాబట్టి పెళ్లి చేసుకోవాలని పెద్దగా ఆసక్తి లేదని కానీ ఇంట్లోవాళ్లు బలవంతం చేసి పెళ్లిచూపులకు తీసుకెళ్లారని అన్నారు. ఆ తరువాత పెళ్లి కుదిరిందని అప్పుడు కూడా సురేఖతో తాను ఎక్కువగా మాట్లాడలేదని చిరంజీవి చెప్పారు. పెళ్లి సమయంలో తాతయ్య ప్రేమ లీలలు అనే సినిమాలో తాను నటిస్తున్నానని నూతన్ ప్రసాద్ అందులో ముఖ్య పాత్రలో నటిస్తూ ఉండటం, నూతన ప్రసాద్ బిజీ ఆర్టిస్ట్ కావడంతో పెళ్లి వాయిదా పడుతుందని అనుకున్నానని కానీ నిర్మాత షూటింగ్ వాయిదా వేయడంతో పెళ్లి వాయిదా పడలేదని అన్నారు. 
 
పెళ్ళిపీటల మీద కూర్చునే సమయంలో చొక్కా చిరిగిపోయిందని సురేఖ చొక్కా మార్చుకోమని చెప్పగా బట్టలు చిరిగితే తాళి కట్టలేనా అని అన్నానని అలాగే తాళి కట్టేశానని చిరంజీవి చెప్పారు. తన పెళ్లినాటి జ్ఞాపకాలను, ఇప్పటివరకూ ఎవరికీ తెలియని విషయాలను చిరంజీవి ఇంటర్వ్యూలో చెప్పారు.      

మరింత సమాచారం తెలుసుకోండి: