రేణు దేశాయ్ చాలా హర్ట్ అయింది. డిజిటల్ మీడియా చేసిన పనికి ఆత్మగౌరవం దెబ్బతింటోందని బాధపడిపోతోంది. తన కష్టార్జీతాన్ని మరొకరి ఖాతాలో వేసే అధికారం మీకెవరు ఇచ్చారని ప్రశ్నలు కురిపిస్తోంది. సోషల్ మీడియా వేదికంగా డిజిటల్ మీడియాకు గట్టిగా క్లాస్ పీకింది రేణు. 

 

రేణు దేశాయ్ చాలా సాఫ్ట్ గా మాట్లాడుతుంది. ఎదుటి వాళ్లను హర్ట్ చేయకుండా తన పనితాను చేసుకుపోతుంది. అలాంటి రేణుదేశాయ్ ఇప్పుడు కొంతమందిపై చాలా సీరియస్ అవుతోంది. ముఖ్యంగా డిజిటల్ మీడియాపై ఆగ్రహంగా ఉంది. హైదరాబాద్ లో రేణు కొనుక్కున్న ఇంటిపై జరుగుతోన్న తప్పుడు ప్రచారంపై చాలా సీరియస్ అవుతోంది రేణు దేశాయ్.

 

రేణు దేశాయ్ రీసెంట్ గా హైదరాబాద్ లో ఓ ఫ్లాట్ కొనుక్కుంది. అయితే ఈ ఫ్లాట్ ఆమె మాజీ భర్త పవన్ కళ్యాణ్ కొనిచ్చాడని కొన్ని వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి. అకీరా నందన్, ఆద్యాకి తండ్రి కానుక అనే హెడ్డింగులతో వార్తలు రాశాయి. రేణు సన్నిహితులు కొంతమంది ఈ వార్తలను నిజమనీ.. ఆమెకు కాల్స్ చేశారు. దీంతో రేణు దేశాయ్ చాలా హర్ట్ అయింది. తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని బాధపడి పెద్ద లెటల్ రాసింది. 

 

రేణుదేశాయ్ డిజిటల్ మీడియాకు పెద్ద క్లాస్ తీసుకుంది. నిజానిజాలు తెలుసుకోకుండా ఓ అసత్యాన్ని ఎలా రాస్తారు. నేను ఇంతవరకు మా నాన్న నుంచి కూడా డబ్బులు తీసుకోలేదు. అలాంటిది మాజీ భర్త నుండి అన్యాయంగా ఎలా తీసుకుంటాను.. సింగిల్ మదర్ ను మీరు గౌరవించకపోయినా పర్లేదు.. ఆత్మగౌరవాన్ని మాత్రం దెబ్బతీయొద్దని ఓపెన్ లెటర్ రాసింది. మరి ఈ లెటర్ తో అయినా రేణు ఇంటి గురించి అసత్యపు ప్రచారాలు ఆగుతాయేమో చూడాలి. మొత్తానికి రేణు దేశాయ్ డిజిటల్ మీడియాకు గట్టి క్లాసే పీకింది. ఇష్టమొచ్చినట్టు రాయడంతో తన ఆత్మగౌరవం దెబ్బతిందని వాపోయింది. ఇలాంటి పుకార్లు సృష్టించడం సరికాదంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: