కన్నడ భామ రష్మిక మందన్న తెలుగు తమిళ భాషల్లో సూపర్ ఫామ్ లో ఉంది. కోలీవుడ్ లో కార్తితో సినిమా చేస్తున్న రష్మిక తెలుగులో మాత్రం వరుస స్టార్ ఛాన్సులు కొట్టేస్తుంది. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక ఆ సినిమాలో తన మార్క్ నటనతో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబో మూవీలో అమ్మడికి అవకాశం రాగా దానితో పాటుగా త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో సినిమాకు ఆమెను సెలెక్ట్ చేశారని తెలుస్తుంది.  

 

తెలుగులో సూపర్ ఫామ్ లో ఉండి తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న అమ్మడికి తమిళ హీరో విజయ్ తో క్రష్ ఉందని అంటుంది. చిన్నప్పటి నుండి రష్మిక ఇళయదళపతి విజయ్ కు పెద్ద ఫ్యాన్ అట. అంతేకాదు తన మొదటి క్రష్ ఆయనే అని అంటుంది రష్మిక. ప్రస్తుతం నితిన్ హీరోగా భీష్మ సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ మీద తనకు ఉన్న క్రష్ ను బయటపెట్టింది. విజయ్ తో ఛాన్స్ వస్తే ఎగిరిగంతేస్తా అంటుంది ఈ అమ్మడు. విజయ్ రీసెంట్ మూవీ బిగిల్ లో రష్మికకు ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆమె నటించడం కుదరలేదు.

 

విజయ్ తర్వాత సినిమాలో రష్మికకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తుంది. తెలుగులో ఆల్రెడీ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న రష్మిక తమిళంలో కూడా హవా కొనసాగించాలని చూస్తుంది. ఓ పక్క మాత్రుభాష కన్నడలో కూడా వచ్చిన అవకాశాన్ని కాదనకుండా చేస్తున్న అమ్మడు సౌత్ మొత్తం టాప్ లేపేలా ఉంది. సమంత, అనుష్క, కాజల్, తమన్నా వీరంతా కెరియర్ లో కొద్దిగా వెనకపడగా రష్మికతో పాటుగా పూజా హెగ్దే వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: