రష్మిక మంధన... ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువగా వినపడుతున్న పేరు. వరుసగా సినిమాలు చేయడమే కాకుండా హిట్లు కూడా కొడుతూ దూసుకుపోతుంది ఈ అమ్మాయి. దీనితో దర్శక నిర్మాతలు కూడా ఈమెకు అవకాశాలు ఇవ్వడానికి సిద్దమవుతున్నారు. ఇటీవల మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన ఈ అమ్మాయి... ఇప్పుడు నితిన్ హీరోగా భీష్మ అనే సినిమాలో అంటించింది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. శివరాత్రి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా సందర్భంగా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యులో ఆమె కొన్ని విషయాలు వెల్లడించింది. సినిమాలో తన పాత్ర చైత్ర అని, నటన కూడా బాగా చేశా అని, ఈ సినిమా ద్వారా తాను మంచి డాన్సర్, మంచి సింగర్ అనిపించుకుంటా అంటూ కామెంట్స్ చేసింది. అదే విధంగా ఈ సినిమాలో కామెడి కూడా బాగానే ఉందని చెప్పింది ఈ అమ్మాయి. తన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అని కూడా చెప్పేసింది ఈ భామ. ఇక ఇదిలా ఉంటే నితిన్ జరిగిన కొన్ని సంభాషణలు కూడా ఆమె చెప్పింది. 

 

నితిన్.. పవన్ కళ్యాణ్ అభిమాని అని మీకు తెలుసా అని అడిగిన ఒక ప్రశ్నకు గాను... మాటల మధ్యలో ఒకసారి తాను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమానినని నితిన్ చెప్పారని... చిన్నప్పట్నుంచీ ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అని వివరించింది. ఇప్పుడు తను యాక్టర్ అయినా కూడా ఇంకా ఆయన ఫ్యాన్‌గానే ఉండటం ముచ్చటగా అనిపించిందని చెప్పుకొచ్చింది. 'పవన్ గారిని ఎప్పుడైనా కలిశారా?' అనడిగానని, రెండు మూడుసార్లు కలిశానని నితిన్ చెప్పారని చెప్పుకొచ్చింది. మొత్తానికి నితిన్ ఒక ఫ్యాన్ బోయ్ అంటూ విశేషాలు చెప్పింది. నితిన్ తో సినిమా చేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అంటూ వివరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: