దివంగత హరికృష్ణ మృతి తర్వాత నందమూరి సోదరులు పైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎంతో అన్యోన్యంగా వుంటున్నారు. హరికృష్ణ మరణానికి ముందు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉండేవి. అయితే మిగిలిన నందమూరి నారా కుటుంబాల తో పోలిస్తే మాత్రం వీరిద్దరి మధ్య సఖ్యత ఉందనే చెప్పాలి. దివంగత నందమూరి జానకిరామ్ ఆకస్మిక మరణం ఆ తర్వాత ఎన్టీఆర్ హరికృష్ణ ఫ్యామిలీకి బాగా దగ్గరయ్యాడు. హరికృష్ణ మృతి చెందాక కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మరింత దగ్గరయ్యారనే చెప్పాలి. ఎన్టీఆర్ జై లవకుశ సినిమాతో తన అన్న అప్పులు మొత్తం షేర్ చేశాడు.

 

జై లవకుశ సినిమా తో కళ్యాణ్ రామ్ గత పదేళ్లుగా సినిమాల కోసం చేసిన అప్పులన్నీ తీరిపోయి. ఇక ఇప్పుడు తమ్ముడుతో మరో సినిమా చేసేందుకు కళ్యాణ్ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ మరోసారి నటించేందుకు యంగ్ టైగర్ కూడా రెడీగా ఉన్నాడట. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్‌. సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా మొదలు కానుంది. ఆ సినిమా తర్వాత కోలీవుడ్ దర్శకుడు అట్లీ తో   ఎన్టీఆర్ సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం.

 

ఈ రెండు సినిమాలకు మధ్యలో ఏమాత్రం చిన్న గ్యాప్ వచ్చినా తమ్ముడు తో సినిమా తీసేందుకు కళ్యాణ్‌రామ్ ఇప్పటి నుంచే ఓ ప్రణాళిక ఉన్నట్టు తెలుస్తోంది. డైరెక్టర్ తో ఇటీవలే ఓ టాప్ డైరెక్ట‌ర్‌తో కళ్యాణ్‌రామ్ మంచి కథ ఉంటే చెప్పమని అడగగా ఆ డైరెక్టర్ సైతం ఎన్టీఆర్ కోసం అదిరిపోయే కథ‌ తన వద్ద ఉందని చెప్పినట్టు సమాచారం. ఈసారి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కు రెమ్యూనరేషన్ కు బదులుగా లాభాల్లో వాటా ఇవ్వాలని భావిస్తున్నాడట కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాడని వార్తలు రావడంతో పలువురు దర్శకులు ఆ సినిమాను డైరెక్ట్ చేసేందుకు కళ్యాణ్ రామ్ కాకా పడుతున్నట్టు టాక్ ఏదేమైనా అన్నదమ్ముల అనుబంధం మరో సినిమాతో మళ్లీ ఆవిష్కృతం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: