యువ నటి రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ఒకరు. నాగ శౌర్య సరసన ఛలో అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక, ఆ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత నానితో కలిసి ఆమె నటించిన దేవదాస్ ఫ్లాప్ కాగా, అనంతరం విజయ్ దేవరకొండతో కలిసి నటించిన గీత గోవిందంతో మరొక సూపర్ హిట్ కొట్టింది. ఇక ఇటీవల సూపర్ స్టార్ మహేష్ తో కలిసి ఆమె నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా మంచి హిట్ కొట్టి టాలీవుడ్ లో రష్మిక క్రేజ్ ని మరింతగా పెంచింది అనే చెప్పాలి. 

 

ఇక ప్రస్తుతం రష్మిక రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. స్వతహాగా కన్నడ భామ అయిన రష్మిక, ఎప్పుడూ సెట్స్ లో ఎంతో చలాకీగా ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఫాన్స్ కి చేరువ అవుతూ ఉంటుంది. ఇక ఇటీవల ఆమె ఇంటిపై హఠాత్తుగా ఐటి దాడులు జరగడం జరిగింది. కొంత మొత్తంలో డబ్బు, పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి . అయితే ఆ ఘటనపై ఇప్పటివరకు రష్మిక మాత్రం నోరు విప్పలేదు. 

 

ఇక అతి త్వరలో నితిన్ తో కలిసి ఆమె నటిస్తున్న భీష్మ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా నేడు కొన్ని మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ లు ఇచ్చిన రష్మిక, తన ఇంటిపై జరిగిన ఐటి దాడుల గురించి ఫైనల్ గా నోరు విప్పింది. ఆమె మాట్లాడుతూ, తన తండ్రి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అని, అలానే తమకు కొద్దిపాటి ఆస్తులతో పాటు టీ ఎస్టేట్స్ కూడా ఉన్నాయని చెప్పిన రష్మిక, ఐటి అధికారుల దాడులు మాములుగా జరిగినవేనని, అలానే దాడుల సమయంలో అమ్మ, నాన్న అన్ని లెక్కలు వారికి చూపించగా, అవి సక్రమంగా ఉండడంతో ఐటి అధికారులు తిరిగి వెళ్లిపోయారని, అయితే తన ఇంటి నుండి డబ్బు, పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవం అని ఆమె కొట్టిపారేసింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: