బోనీ కపూర్ నిర్మాతగా పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న చిత్రం పింక్. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే వేసవిలో విడుదల అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు సినిమా షూటింగ్ ని దర్శకుడు పూర్తి చేసారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా బోనీ కపూర్ తన కుటుంబం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు. ఒక స్టార్ హీరోతో తనకు వచ్చిన విభేదాల గురించి కూడా బోనీ వివరించారు. 

 

అసలు ఆయన ఎం మాట్లాడారు...? ఎం చెప్పారు...? తన కుమారుడు అర్జున్‌ ని ఎందుకు హీరోగా మీరే పరిచయ౦ చేయలేదు అనే ప్రశ్నకు గాను స్పందించిన బోనీ... అర్జున్‌ ఎప్పుడూ దర్శకుడు కావాలని అనుకునేవాడని, అందుకే నేనూ కూడా హీరోగా రావాలనే ప్రయత్నం చేయలేదని వివరించారు. అయితే ఓ రోజు సల్మాన్‌ ఫోన్‌ చేసి నటుడికి కావాల్సిన లక్షణాలన్నీ అర్జున్‌లో ఉన్నాయని చెప్పాడని, అతన్ని నటుడిగా పరిచయం చేస్తే బాగుంటుందని చెప్పారని... హీరోగా అర్జున్‌కు బీజం వేసింది సల్మానే అని చెప్పారు ఆయన. 

 

అయితే కొన్ని కారణాల వల్ల నాకు, సల్మాన్‌ కు సంబంధాలు దెబ్బతిన్నాయని ఆయన ఆసక్తికర విషయం చెప్పారు. కానీ హీరోగా అర్జున్‌ హీరోగా ఎదగడానికి సహకరించింది సల్మానే అని చెప్పారు. ఇక తన కుటుంబం గురించి చెప్పిన ఆయన... తన కుమార్తె అన్షులా చాలా తెలివి అయిన అమ్మాయని, అమెరికాలో ఉద్యోగం వచ్చినా సరే తెలివైన అమ్మాయి కావడంతో ముంబై లో ఆఫీస్ కి ఆమెను పంపించారని ఆయన వివరించారు. మీకు పిల్లల్లో ఎవరు ఇష్టం అనే ప్రశ్నకు గాను... ఒక తండ్రిగా తనకు అందరూ సమానమే అంటూ ఈ స్టార్ నిర్మాత మీడియాకు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: