టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస బ్లాక్బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హాట్రిక్ విజయం సాధించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు 27వ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికా ట్రిప్ లో ఉన్న మహేష్ బాబు ఇండియాకు వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో ఎవరు మ్యూజిక్ అందించబోతున్నారు అనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే మహేష్ బాబు 27వ సినిమాకి తమన్ సంగీతం అందించబోతున్నారు అని వార్తలు వచ్చాయి.
అయితే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తే బాగుంటుందని మహేష్ బాబు సతీమణి నమ్రత సూచించారట. ఇక ఇతర స్నేహితులు కూడా అనిరుద్ సంగీతం అంతగా క్లిక్ లేదని మణిశర్మను ఎంచుకోవాలి అని సలహాలు ఇస్తున్నారట. ఇదిలా ఉంటే గతంలో మణిశర్మ మహేష్ బాబు సినిమాలకు ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు. ఈమధ్య ఇస్మార్ట్ శంకర్ తో మణిశర్మ ఫుల్ ఫాంలో కూడా ఉన్నారు. ఇక చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు కూడా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సంగీతం కోసం మణిశర్మ నే ఓకే చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే మహేష్ బాబు సతీమణి నమ్రతా మాత్రం ఈ జనరేషన్ కు తగ్గట్టుగా సంగీతం అందించాలంటే అనిరుద్ సెలెక్ట్ చేయాలంటూ అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమాలో సంగీత దర్శకుడిగా ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నారని ఇది కూడా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వంశీ పైడిపల్లి మహేష్ బాబు కాంబినేషన్ లో సూపర్ హిట్ సినిమాలు ఉండటంతో ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి.కాగా సినిమా యొక్క కథాంశం ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు.