ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపడంతో అధికార విపక్షాలు ఒకరి పై ఒకరు మాటల దాడి కూడా చేసుకుంటున్నారు.ముఖ్యంగా రాజధాని మార్పు విషయంలో పట్టుదలగా ఉన్న అధికార వైసీపీ ఈ విషయంలో కాస్త దూకుడుగానే ఉందీ అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పోరాటం చేసినా సరే జగన్ మాత్రం రాజధాని విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు. ఉగాది నాటికి రాజధాని తరలింపు దాదాపుగా పూర్తి కావడం ఖాయమని అంటున్నారు. 

 

నూతన తెలుగు ఏడాది నుంచి రాజధాని విశాఖ లోనే అంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు. అంత వరకు బాగానే ఉంది గాని... ఇప్పుడు టాలీవుడ్ లో అమరావతి బెంగ ఎక్కువగా ఉందీ అంటున్నారు. ముగ్గురు నిర్మాతలు, నలుగురు స్టార్ హీరోలు, ఇద్దరు హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఒక 20 మంది వరకు అమరావతిలో భూములు కొనుగోలు చేసారు. లక్షల్లోకోట్లు ఉన్నప్పుడు కొనుగోలు చేసారు. ఇప్పుడు అవి లక్షల్లో అయ్యాయి. దీనితో టాలీవుడ్ లో భయం మొదలయింది. రాజధానిగా అమరావతి ఉండే అవకాశం ఎంత మాత్రం లేదనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

విశాఖలో భూముల ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడివి అమ్ముడు అయ్యే పరిస్థితి కూడా కనపడటం లేదు. అమరావతిలో భూములు ఉన్న నిర్మాతలు అయితే ఆర్ధికంగా బ్లాక్ అయిపోయారని అంటున్నారు. ఈ విషయంలో ఏ విధంగా ముందుకి వెళ్ళాలో అర్ధం కాక నానా ఇబ్బందులు పడుతున్నారు. తమకు పరిచయం ఉన్న రాజకీయ నాయకుల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎదోకరకంగా భూమి అమ్ముడు అయితే చాలు అదే పదివేలు అనుకుంటున్నారు. ఆంధ్రా నుంచి బయటకు వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. హీరోయిన్లు అయితే ఎటూ పాలుపోక కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితుల్లో ఉన్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: