స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. జనవరి 12 న ప్రేక్షకుల ముందుకి వచ్చి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది ఈ సినిమా. అటు పాటల పరంగా కూడా ఈ సినిమా సరికొత్త చరిత్ర సృష్టించింది. టాలీవుడ్ లో కూడా కొన్ని రికార్డులను ఈ సినిమా తిరగరాసింది. అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు ఈ సినిమాకు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. 

ఈ సినిమాను కథ సమస్య వేధిస్తుంది. అసలు ఈ సినిమా కథ కాపీ అనే ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఈ సినిమా కథపై చర్చ కూడా జరుగుతుంది. కథను త్రివిక్రమ్ కాపీ చేసాడు అంటూ సోషల్ మీడియాలో కొందరు ఆరోపిస్తున్నారు. కృష్ణ అనే ఒక ద‌ర్శ‌కుడి ద‌గ్గ‌ర నుండి త్రివిక్ర‌మ్ క‌థ‌ను దొంగతనం చేసాడని ఆరోపిస్తున్నారు. దీనితో సదరు దర్శకుడు ఈ వ్యవహారంపై సీరియస్ గా ఉన్నారని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. 

సదరు దర్శకుడు త్రివిక్రమ్ మీద యాక్షన్ కి సిద్డమయ్యాడు అని తెలుస్తుంది. తన కథను కాపీ చేసినందుకు గాను, త్రివిక్ర‌మ్‌కి లీగ‌ల్ నోటీసులు ఆ దర్శకుడు ఇవ్వాల‌నుకుంటున్నాడ‌ని ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ సినిమా కథను ఏడేళ్ళ క్రితమే అంటే 2013 లోనే ఫిలించాంబ‌ర్‌లో రిజిష్ట‌ర్ చేయించాడరట. స్క్రిప్ట్ ఫ‌స్ట్ పేజీని డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌కి ఇచ్చి, తాను దశ దిశా సినిమా చెయ్యాలి అనుకుంటున్నా అని చెప్పగానే త్రివిక్రమ్ దాన్ని ఈ సినిమాగా తీసాడు అంటూ దర్శకుడు ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: