టాలీవుడ్ లో రాజమౌళి రేంజ్ వేరు అనే విషయం అందరికి తెలిసిందే. ఆయన సినిమాలకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతీ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఆయన సినిమాల కోసం నిర్మాతలు ఎంతగానో పోటీ పడుతూ ఉంటారు. చిన్న చిన్న నిర్మాతలు కూడా రాజమౌళి సినిమాల్లో పెట్టుబడులు పెట్టాలి అని భావిస్తూ ఉంటారు. అయితే రాజమౌళి మాత్రం చాలా వరకు పెద్ద దర్శకులతోనే సినిమాలు చేయడం అనేది మనం చూస్తున్నాం. అది అంతా ఓకే గాని ఇప్పుడు ఆయన గురించి ఒక వార్త హల్చల్ చేస్తుంది. 

 

అది ఏంటీ అంటే, రాజమౌళి కమర్షియల్ సినిమాల పిచ్చోడు అంటున్నారు. దానికి కారణం ఏంటి అనేది చూస్తే, తన తండ్రి రాజేంద్ర ప్రసాద్ రాసే కథలు బాలీవుడ్ లో సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. అక్కడ దాదాపుగా ఆ సినిమాలు అన్నీ కమర్షియల్ గానే ఉంటాయి అనే సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో ఆయన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అది చూసే రాజమౌళి కమర్షియల్ గా మారిపోయారు అనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. అందుకే ఆయన పెద్ద హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. 

 

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమాను రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి చేస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో వస్తుంది. ఇప్పటికే భారీ మార్కెట్ కూడా జరిగినట్టు సమాచారం. ఇక పోతే ఆయన తదుపరి చిత్రం కూడా ఇదే రేంజ్ లో ఉంటుంది అనే టాక్ వినపడుతుంది. ప్రభాస్, మహేష్ బాబుతో ఒక సినిమా కోసం ఆయన అంతా సిద్దం చేసుకున్నారని, ప్రస్తుతం సినిమా పూర్తి కాగానే ఆ సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో రాజమౌళి చేస్తున్నారని అంటున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఆ సినిమా వచ్చే అవకాశం ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: