ప్రస్తుత౦ టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పెరిగింది. ఆయన సినిమాలు అన్నీ కూడా టాప్ రేంజ్ లో వస్తున్నాయి. ఫ్లాపులు లేకుండా తారక్ జాగ్రత్త పడుతున్నాడు. గత పదేళ్ళలో ఒకటో రెండో సినిమాలు మినహా తారక్ నుంచి వచ్చిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు. అన్నీ కూడా కమర్షియల్ గా మంచి విజయాలు సాధించాయి. దీనితో దర్శక నిర్మాతలు ఎక్కువగా ఆయనతో సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. తారక్ కూడా కంగారు పడకుండా జాగ్రత్తలు పడుతున్నారు. 

 

ఇప్పుడు ఆయన రూటు మార్చారు అనే టాక్ వినపడుతుంది. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేయడం కోసం హీరోలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తమ సినిమాలకు భారీ మార్కెట్ ఉంటుంది అనే భావనలో ఉన్న హీరోలు దర్శకులకు అదే విషయాన్ని స్పష్టంగా చెప్పేస్తున్నారు. దీనితో దర్శకులు ఆ విధంగానే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అలాగే ముందుకి వెళ్తున్నారు. తనకు తమిళంలో కూడా క్రేజ్ ఉన్న నేపధ్యంలో తారక్ తమిళ దర్శకులతో సినిమాలకు ప్లాన్ చేస్తున్నారు. 

 

అక్కడ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఇక బాలీవుడ్ దర్శకుడి తో కూడా సినిమాకు ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ దర్శకులతో సినిమాలు చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు తెలుగు మార్కెట్ మీదే దృష్టి పెట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు దేశం మొత్తం దృష్టి పెట్టాడు. కన్నడంలో ఒక దర్శకుడి తో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రశాంత్ నీల్ తో కన్నడం, రోహిత్ శెట్టి తో బాలీవుడ్ లో, వెట్రిమారన్ తో తమిళంలో సినిమా చెయ్యడానికి దాదాపుగా సిద్దం అయ్యాడని సమాచారం. త్రివిక్రమ్ తో సినిమా తర్వాత వీటిని ఒక్కొక్కటిగా ముందుకి తీసుకువెళ్ళే అవకాశం ఉందని టాక్ ఎక్కువగా వినపడుతుంది. ఇది ఎంత వరకు నిజమో చూడాలి మారి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: