టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్ అవడంతో తన తర్వాతి సినిమాకి రెడీ అవుతున్నాడు. మహర్షి సినిమా దర్శకుడయిన వంశీ పైశిపల్లితో తన తర్వాతి సినిమా ఉంటుందని అందరికీ తెలిసిందే. మహర్షి సినిమా ద్వారా కెరీర్ బెస్ట్ కలెక్షన్లు సాధించిన మహేష్, ఆ తర్వాతి సినిమా సరిలేరు నీకెవ్వరు ద్వారా ఆ రికార్డుని బద్దలు కొట్టడం విశేషం. ఒక హీరోగా వరుసగా రెండు బ్లాక్ బస్టర్లు ఇవ్వడం మామూలు విషయం కాదు.

 

 

మహేష్ ప్రస్థానం చాలా పెద్దది. బాలనటుడిగా తండ్రి క్రిష్ణ గారితో సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అయితే ఒక హీరోగా తనకంటూ పేరు తెచ్చుకుంది మాత్రం రాజకుమారుడు సినిమాతోనే... రాఘవేంద్రరావు దర్శకత్వంలో మహేష్ హీరోగా ప్రీతి జింటా హీరోయిన్ గా రాజకుమారుడు అనే సినిమా తెరకెక్కింది. బహుశా ఆ సినిమా నుండే మహేష్ కి ప్రిన్స్ అన్న పేరు వచ్చి ఉంటుంది. అయితే ఈ సినిమాలో ఒకానొక టైమ్ లో దర్శకుడు రాఘవేంద్రరావు మహేష్ కి వార్నింగ్ ఇచ్చాడట.

 

 


ప్రీతి జింటా, మహేష్ ల మధ్య ఒక సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు మహేష్ ఎందుకో ఇబ్బంది పడుతున్నాడట. ప్రీతిజింటా నార్మల్ గా తన పార్ట్ పూర్తి చేసిందట. మహేష్ ఇబ్బంది వల్ల ఆ సీన్ లేట్ అయిందట. ఆ టైమ్ లో రాఘవేంద్రరావు మహేష్ ని పిలుచుకుని ఆ సీన్ గురించి చెప్పడమే కాకుండా, అంతలా ఇబ్బంది పడడానికి కారణం కనుక్కుని, ఆ ఇబ్బందిని పోగొట్టే ప్రయత్నం చేశాడట. అలా రాఘవేంద్రరావు మహేష్ కి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.

 

 

ఒక్క డాన్స్ విషయంలో తప్పితే మహేష్ ని వంక పెట్టేందుకు ఏమీ లేదు. హీరోగా రాజకుమారుడు మొదటి సినిమా కావడంతో కొంత తడబడి ఉంటాడు. అదీగాక మహేష్ సిగ్గు గురించి అందరికీ తెలిసిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: