టాలీవుడ్ లో ఇప్పుడు చిరంజీవి తర్వాత పవన్ కళ్యార్, రామ్ చరణ్, బన్నీ, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వరుసగా షూటింగ్ బిజీలో ఉన్నారు. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ తెలుగు తో తప్ప మిగిలిన మూడు భాషలు మాలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ లో డిజాస్టర్ అయ్యింది. అయితే వరుణ్ తేజ్ నటించి గద్దల కొండ నరేష్, సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి, ప్రతిరోజు పండుగే, అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ ఇలా వరుస విజయాలతో ముందుకు వెళ్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల విరామం తర్వాత తమిళంలో విజదళపతి విజయ్ నటించిన ‘కత్తి’ మూవీ రిమేక్ తో ‘వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ మూవీ రైతు సమస్యలపై ఓ యువకుడు చేసిన పోరాటం మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయంలో నటించాడు. ఓ పాత్రలో పూర్తి తరహా ఎంట్రటైన్ చేయడం సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడం చిరుకి ఇక లైన్ క్లీయర్ అనుకున్న సమయంలో సైరా నరసింహారెడ్డి కాస్త నిరాశ పరిచింది. అయితే ఈ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కి ఆచార్య అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మెగా హీరోలు రిమేక్ సినిమాలపై ఫోకస్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఈ మద్య జాను మరికొన్ని సినిమాలు ఫ్లాప్ టాక్ రావడంతో మెగా హీరోలు సైతం రిమేక్ విషయంలో ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయినా.. తెలుగు కొన్ని సార్లు రిమేక్ సినిమాలకు దెబ్బ పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాను మూవీ కన్నడ, తమిళ నాట మంచి విజయం అందుకున్నా తెలుగు లో మాత్రం అంతగా సక్సెస్ సాధించలేదు. ఇదే దృష్టిలో పెట్టుకొని మెగా హీరో రిమేక్ విషయంలో ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ టాక్ వినిపిస్తుంది.