తమిళంలో సూపర్ స్టార్ రజినీ తర్వాత ఆ రేంజ్ మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో అజిత్ కుమార్.  తెలుగు లో గొల్లపూడి మారుతీరావు తనయుడు తీసిన ‘ప్రేమ పుస్తకం’ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. అయితే తెలుగు తన చిత్రం ఫ్లాప్ టాక్ రావడంతో తమిళంలోకి వెళ్లాడు.  అక్కడ ప్రేమలేఖ లాంచి చిత్రంతో సూపర్ విజయం అందుకున్నాడు. తెలుగు, తమిళంలో అజిత్ నటించే చిత్రాలకు మంచి ఆదరణ పెరిగిపోయింది.  అంతే కాదు గత కొంత కాలంగా వరుస విజయాలతో తల అజిత్ దమ్మురేపుతున్నారు.  తన సహనటి షాలిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అజిత్ రియల్ లైఫ్ లోనే కాదు..  రీల్ లైఫ్ లో కూడా చాలా సింపుల్ గా నెరసిన జుట్టుతోనే కనిపించేందుకు ఇష్టపడుతుంటారు. 

 

అజిత్ వరుస విజయాలు సాధిస్తున్న  నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రంగా 'వాలిమై' రూపొందుతోంది. బోనీ కపూర్ నిర్మాణంలో వినోత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. త్వరలో విలన్ కాంబినేషన్లో సీన్లు చేయవలసి ఉందట.  ఇటీవల బోనీ కపూర్ నిర్మాణ సారథ్యంలో బాలీవుడ్ లో హిట్ అయిన పింక్ రిమేక్ లో నటించాడు.  ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.  తాజాగా వినోత్ దర్శకత్వంలో  'వాలిమై'  చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా.. అజిత్ కి సరైన విలన్ ఎవరా అన్న వేటలో ఉన్నారట. విలన్ పాత్ర కోసం తెలుగు నుంచి యంగ్ హీరోలను తీసుకోవాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఉన్నారట.

 

ఈ నేపథ్యంలోనే తెలుగులో కార్తికేయ పేరు వినిపించింది.  అంతే కాదు నవదీప్ పేరు కూడా వినిపించింది. అయితే ఈ ఇద్దరు హీరోలుగానే కాకుండా విలన్లు గా కూడా నటిస్తున్న విషయం తెలిసందే.  గ్యాంగ్ లీడర్ లో కార్తికేయ, బాద్ షా మూవీలో నవదీప్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. అజిత్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ ఇద్దరిలో విలన్ గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి మరి. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా హుమా ఖురేషి కనిపించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: