టాలీవుడ్‌లో ఉన్న క్యూటెస్ట్ జోడీల్లో వీరి జంట ఒక్కటి. వారి పెళ్లి జరిగిన దగ్గర నుండి ఇప్పటివరకు వారి ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చింది లేదు. ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఈ జోడి ఎవరికీ నచ్చినట్టు వారు ఉంటారు. కానీ వీరి జంట అందరికి ఆదర్శం. ఇప్పటికీ ఒకరికొరు గౌరవించుకుంటూ గౌరవప్రదంగా ఉంటున్నారు. వారే మన సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమత్ర శిరోద్కర్‌లు.

 

ప్రేమించడం, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం లాంటివి సినిమాల్లోనే కాదు....మహేష్ బాబు జీవితంలోనూ చోటు చేసుకున్నాయి. తనతో పాటు హీరోయిన్‌గా నటించిన నమ్రతను మహేష్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారు పెళ్లి చేసుకోవడం కోసం ఐదేళ్లు వేచి చూశారు.

 

పెద్దలను ఎదురించి చేసుకునే ప్రేమ వివాహం కావడంతో మహేష్ బాబు, నమ్రత వివాహం ముంబైలో నిరాడంబరంగా జరిగింది.న మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ‘వంశీ' అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మొదలైన స్నహం ఆ తర్వాత ప్రేమగా మారింది. పెళ్లికి ముందు దాదాపు ఐదేళ్లు డేటింగ్ చేసారు.

 

మాజీ ఫెమీనా మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్‌తో 5 సంవత్సరాలు డేటింగ్ చేసిన మహేష్ బాబు ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 10, 2005లో వీరి వివాహం ముంబైలో జరిగింది. తొమ్మిదేళ్ల దాంపత్య జీవితంలో మహేష్, నమ్రత ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చారు. వారే గౌతమ్, సితారలు. ప్రస్తుతానికైతే ఇద్దరూ చదువుకుంటున్నారు. 

 

మహేష్ కొడుకు 1-నేనొక్కడినే సినిమాలో నటించారు. ఆ సినిమాలో గౌతం పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఏడేళ్ల వయసులో తొలి సినిమాలోనే ఎంతో మెచ్యూరిటీ చూపించాడు గౌతం. తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకున్నాడు గౌతమ్. టాలీవుడ్లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులు అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: