చలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఎక్కడ అందాల ఆరబోతకు తావివ్వకుండా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ను సంపాదించుకుంది రష్మిక మందన. ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా గ్లామరస్ పాత్రలో మెరవకుండానే  స్టార్ హీరోయిన్ హోదా ని సంపాదించింది. ఇక ప్రస్తుతం తెలుగు కన్నడ భాషల్లో వరుస సినిమాలను చేసుకుంటూ బిజీగా ఉంది ఈ అమ్మడు. మొన్నటికి మొన్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకుంది. కాగా ప్రస్తుతం భీష్మ సినిమాలో నటిస్తోంది. 

 

 

 ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సినీ ప్రముఖులపై జరుగుతున్న ఐటీ దాడులు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రష్మిక మందన ఇంటిపై జరిగిన ఐటీ దాడులు కూడా దుమారం రేపాయి. అయితే మామూలుగా అయితే సెలబ్రిటీలు ఎవరు ఐటీ దాడులపై స్పందించేందుకు ఇష్టపడరు. కానీ రష్మిక  మాత్రం తనపై జరిగిన ఐటీ దాడుల గురించి క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం రష్మిక మందన్న నితిన్ హీరోగా నటిస్తున్న భీష్మ సినిమా ఇంకొన్ని రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది రష్మిక మందన. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు హాజరు అయిన రష్మిక మందన ను  ఐటీ దాడుల గురించి యాంకర్ ప్రశ్నించగా.. ఎలాంటి తడబాటు లేకుండా క్లారిటీ ఇచ్చేసింది. 

 

 

 ఇంతకీ రష్మిక ఏమని సమాధానం ఇచ్చిందంటే.. తన తండ్రి వ్యాపారవేత్త అని తాను నటిని కావడంతో తమ ఇంట్లో క్యాజువల్గా ఐటి రైడ్స్ చేశారని క్లారిటీ ఇచ్చింది రష్మిక. తనిఖీలు జరుగుతున్నాయని తెలిసి తాను కూడా వెళ్లానని తమ ఇంట్లో ఏమీ దొరక్కపోవడంతో ఐటీ అధికారులు వెళ్లిపోయినట్లు గా క్లారిటీ ఇచ్చేసింది. కాగా తమపై జరిగిన ఐటీ దాడులపై ఇంత ఓపెన్ గా చెప్పే సెలబ్రిటీలు చాలా తక్కువగా ఉంటారు. కానీ రష్మిక చాలా సింపుల్గా తనపై జరిగిన ఐటీ దాడుల గురించి చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: