టాలీవుడ్ లో ప్రభాస్ హీరోగా నటించిన ‘వర్షం’ సినిమాతో హీరోయిన్ గా ఎన్నాళ్లకు గుర్తుచ్చానా వానా అంటూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది నటి త్రిష.  ఆ తర్వాత తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది నిషాకళ్ల సుందరి.   గత కొంత కాలంగా త్రిష ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తుంది. అందులోనూ హర్రర్ మూవీస్ లో ఎక్కువగా నటిస్తంది.  గతంలో త్రిష నటించే సినిమాలకు భలే డిమాండ్ ఉండేది.  పదిహేనేళ్లు దాటినా ఈ అమ్మడి గ్లామర్ ఏమాత్రం తగ్గకుండా తన అందాన్ని మెయింటేన్ చేస్తుంది. తాజాగా శరవణన్ దర్శకత్వంలో ‘రాంగి’ అనే సినిమాలో నటించింది. 

 

ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కథ, మాటలు అందించడం గమనార్హం.  తాజాగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ అద్భుతంగా నటించిన  కోలీవుడ్ భామ త్రిషకు చిత్ర పరిశ్రమ నుంచి అభినందనలు  కురిపిస్తున్నారు. ‘రాంగి ’ సినిమా ఆఖరి షెడ్యూల్‌ను ఇటీవల ఉజ్బెకిస్థాన్‌లో పూర్తిచేశారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉష్ణోగ్రత మైనస్ రెండు డిగ్రీల్లో ఉందట.  అయితే ఈ షూటింగ్ చేయడం ఇబ్బంది అయితే వదిలేద్దామని చిత్ర యూనిట్ చెప్పినా.. త్రిష మాత్రం తప్పకుండా చేస్తానని వాళ్లు ఒప్పించి మరీ షూట్ లో పాల్గొన్నదట. తెల్లవారుజామునే లేచి షూటింగ్‌కు రెడీ అయిపోయేదట. అంతటి చలిలోనూ ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఆమె నటించడంతో షెడ్యూల్ త్వరగా పూర్తయిందని యూనిట్ చెప్పారు.

 

మైనస్ డిగ్రీల్లోనూ అద్భుతంగా నటించి షెడ్యూల్‌ సకాలంలో పూర్తయ్యేలా చేసిన త్రిషను యూనిట్ సభ్యులు అభినందించారు. అయితే సినిమా కోసం ఇంత డెడికేషన్ తో నటించడం నిజంగా ప్రశంసనీయమే కాదు.. ఆమె పట్టుదలకు సినీ పరిశ్రమలో ఎంతో మెచ్చుకుంటున్నారు.  గతంలో కూడా కొన్ని రిస్కీ షూట్స్ లో త్రిష పాల్గొని మెప్పించందన్న వార్తలు చదివాము. ఏది ఏమైనా సినిమా కోసం ఇలాంటి రిస్కులు చేయడం కూడా చాలా డేంజర్ అంటున్నారు ఆమె అభిమానులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: