టాలీవుడ్ లో ఈ మద్య వరుస విజయాలు అందుకుంటూ టాప్ ప్లేస్ లోకి వెళ్లింది అక్కినేని సమంత.  ఏం మాయ చేసావే సినిమాతో పరిచయం అయిన అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత అసలు సినిమాల్లోనే నటించదని టాక్ వినిపించింది.  కానీ వివాహం జరిగిన మూడు నెలల తర్వాత సమంత నటించిన రంగస్థలం, అభిమన్యుడు, యూటర్న్, మజిలీ ఇలా వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటున్న సమంత తాజాగా ‘జాను’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఈ మూవీ తమిళ్, కన్నడలో 96 గా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.  తమిళ్ లో విజయ్ సేతుపతి, త్రిషలు నటించారు.  దిల్ రాజు ఈ సినిమా చూసి పట్టుపట్టి తెలుగు లో రిమేక్ చేయించారు.  

 

ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాను’ తెలుగు లో రిలీజ్ అయ్యింది.  'జానూ' మూవీకి ప్రశంసలు లభించినా, ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాలేదు.  దాంతో కలెక్షన్ల పరంగా ఈ మూవీ బాగానే నష్టం తెచ్చినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.  తాజాగా రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వం వహించిన 'ఆర్‌ఎక్స్ 100' మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.  ప్రస్తుతం ఈ దర్శకుడు 'మహాసముద్రం' స్టోరీతో ఎవరి వద్దకు వెళ్లినా, స్క్రిప్ట్ బాగుందని అన్న వారే తప్ప, చేస్తామని ముందుకు వచ్చిన వారు మాత్రం లేరు.   మొత్తానికి ఆ మద్య సమంత హీరోయిన్ గా ఓకే చెప్పిందట.  

 

అయితే  హీరోగా చేసేందుకు శర్వానంద్ ముందుకు రావడంతో లైన్ క్లియర్ అయిదని భావించి, షూటింగ్ ను ప్రారంభించేందుకు అజయ్ భూపతి ముహూర్తం వెతుక్కుంటున్న సమయంలో ఓ చిక్కు వచ్చి పడిందని సమాచారం. ఈ సినిమాలో  తాను నటించబోనని సమంత స్పష్టం చేసిందట. ఇటీవల శర్వానంద్‌ తో తాను నటించిన 'జాను' రిజల్ట్స్ దీనికి కారణమని తెలుస్తోంది. దాంతో ఈ సినిమా కోసం 'సమ్మోహనం' ఫేమ్ అదితి రావ్ హైదరీని అజయ్ సంప్రదించినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: