ఒకప్పుడు మాస్ లో ఒక రేంజ్ ఫాలోయింగ్ హీరో రవితేజా. అయితే గత మూడు నాలుగేళ్ళుగా ఆయన ప్రభ తగ్గుతూ వచ్చింది. గతంలో ఏడాదికి మూడు లేదా నాలుగు సినిమాలను వరుసగా విడుదల చేసే రవితేజా ఇప్పుడు మాత్రం కాస్త భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇటీవలి కాలంలో ఒక్క హిట్ కూడా అతని నుంచి రాలేదు. దీనితో రవితేజా ఇప్పుడు సినిమాలు చెయ్యాలి అంటే చాలు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నాడు. గ్యాప్ తీసుకున్నా సరే హిట్ మాత్రం రావడం లేదు. ఎలాంటి కథ ఎంపిక చేసుకున్నా సరే హిట్ దక్కే పరిస్థితి కనపడటం లేదు. 

 

అయితే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఇటీవల వచ్చిన డిస్కో రాజా సినిమా షాక్ ఇచ్చింది. ఈ సినిమా మంచి అంచనాలతోనే వచ్చినా ఫ్లాప్ అయింది. ఇప్పుడు క్రాక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం కనపడుతుంది. ఈ సినిమాను గోపీ చంద్ మలినేని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే రమేష్ వర్మతో ఒక సినిమా చేయడానికి ఆయన సిద్దమయ్యాడు. ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఒక లుక్ కూడా రిలీజ్ కానుంది. 

 

ఈ సినిమాలో హీరోయిన్ గా మహేష్ తో భరత్ అను నేను సినిమా చేసిన కియారా అద్వానిని ఎంపిక చేసారు. అయితే ప్రస్తుతం ఆమె కాళీగా లేదు. దాదాపు నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి. దీనితో కొంత కాలం ఆగితే సినిమా చేస్తా అని చెప్పడమే కాకుండా రెండు కోట్లు ఇస్తే ఓకే అని చెప్పింది. అది కూడా 18 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయినా సరే ఆమెను ఎంపిక చేసినట్టు సమాచారం. దర్శకుడు కూడా పెద్దగా షాక్ అవ్వలేదని అంటున్నారు. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: