టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాల హవా కాస్త ఎక్కువ గానే ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. గతంలో ఎక్కువగా వచ్చే మల్టీ స్టారర్ సినిమాలు గత రెండు దశాబ్దాలుగా పెద్దగా రాలేదు. ఎప్పుడో ఏడేళ్ళ క్రితం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆ తర్వాత వెంకటేష్, పవన్ కళ్యాణ్ హీరోలు గా ఒక సినిమా వచ్చింది. ఇప్పుడు రాజమౌళి పుణ్యమా అని మన టాలీవుడ్ దర్శకులు స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చెయ్యాలి అని చూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాలకు ఎక్కువ గా మహేష్ బాబు పేరు వినపడుతుంది.

 

మహేష్ బాబుతో ప్రభాస్ సినిమా, మహేష్ తో వెంకటేష్, మహేష్ తో పవన్ కళ్యాణ్, మహేష్ తో జూనియర్ ఎన్టీఆర్. ఇలా మహేష్ తో మల్టీ స్టార్ ప్లాన్ చేస్తున్నారు. ఏ హీరో అయినా సరే మహేష్ అయితేనే బాగుంటుంది అనే భావన లో దర్శక నిర్మాతలు ఉంటున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండటం, హిట్ రేటింగ్ ఎక్కువగా ఉండటం, బాలీవుడ్ పరంగా కూడా మహేష్ కి కాస్తో కూస్తో ఇమేజ్ ఉండటంతో మహేష్ ని ఆప్షన్ గా ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు దర్శకులు. 

 

అయితే మహేష్ మాత్రం మల్టీ స్టారర్ సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సోలోగానే సినిమాలు చేస్తున్నాడు మహేష్ బాబు. వచ్చే ఏడాది రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ తో కలిసి సినిమా చేసే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఈ సినిమాకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా సమాచారం. ప్రస్తుతం మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్న మహేష్ బాబు ఇప్పుడు ఆ సినిమాలు చేస్తే మంచిది అనే భావనలో ఉన్నాడట. భవిష్యత్తులో కూడా మహేష్ బాబు మంచి సినిమాలు చెయ్యాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: