తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ హీరోగా ‘బద్రి’ చిత్రంతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఆ వెంటనే మాస్ మహరాజ రవితేజ హీరోగా ‘ఇడియట్ ’ చిత్రంతో మరో ఘన విజయం అందుకున్నాడు.  ఈ చిత్రాల తర్వాత మహేష్ బాబు హీరోగా ‘పోకిరి’ చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లో రికార్డుల మోత మోగించారు.  తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏ చిత్రం అయినా నేలల వ్యవధిలోనే పూర్తి చేస్తుంటారని టాక్ ఉన్న విషయం తెలిసిందే.  ఇదే బాటలో పూరి జగన్నాథ్ కూడా తన చిత్రాలు అతి తక్కువ సమయంలోనే పూర్తి చేస్తారని టాక్ ఉంది. 

 

అయితే తన చిత్రాల విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానీ పూరి బడ్జెట్ కూడా అదే రేంజ్ ఉంటుంది.  ఎక్కువగా విదేశాల్లో షూట్ చేస్తుంటారు.. ముఖ్యంగా ఆయన కు నచ్చిన ప్లేస్ బ్యాంకాక్ ఇక్కడ ఒక్క సీన్ అయినా తప్పకుండా ఉండేలా చేస్తారని టాలీవుడ్ టాక్.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసిన టెంపర్ చిత్రం తర్వాత పూరి జగన్నాథ్ కి వరుసగా బ్యాడ్ టైమ్ నడిచింది.  దాంతో ఒక మంచి హిట్ కొట్టాలన్న కసితో ఉన్న సమయంలో ఎనర్జిటిక్ హీరో రామ్ తో కలిసి ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రాన్ని గత ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.  అనుకున్నట్లుగానే ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.  కలెక్షన్లు కూడా అనుకున్నదానికన్నా ఎక్కువే వచ్చాయి. 

 

ఇక మొదటి నుంచి  పూరి జగన్నాథ్ తన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో తనదైన దూకుడు చూపిస్తూనే వచ్చాడు. కథ, మాటలు, పాటలు చివరికి సంగీతం విషయంలో కూడా ఆయనే ప్రత్యేక శ్రద్ద వహిస్తుంటారు.  పూరి ఈ సారి తన తాజా చిత్రానికి 100 రోజులకి పైగా సమయాన్ని తీసుకోనున్నాడని అంటున్నారు. విజయ్ దేవరకొండ సినిమానుంచి అభిమానులు ఆశించే అన్నిరకాల అంశాలు ఉండేలా చూసుకుంటూనే, పాన్ ఇండియా మూవీగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: