ఈ మద్య సెలబ్రెటీలు చేస్తున్న కాంట్రవర్సీ వ్యాఖ్యలు పెను సంచలనాలకు దారి తీస్తున్నాయి.  సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎక్కడ ఏ చిన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా అవి ఇట్టే వైరల్ కావడం.. తర్వాత వాటికి సంజాయిషీ ఇవ్వడమో లేదా తమ మాటలను సమర్థించుకోవడమో జరుగుతుంది.  తాజాగా  రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.  బాగా చదువుకున్న వారే విడాకుల వైపు మొగ్గు చూపుతున్నారని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం(ఆరెస్సెస్‌) చీఫ్ అన్నారు.  అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మోహన్ భగవత్.. ఉన్నత విద్యావంతుల కుటుంబాల్లోనే ఎక్కువగా ఇలాంటి విడాకుల గోలలు ఎక్కువ అవుతున్నాయని అన్నారు.

 

విద్య, డబ్బుతో పొగరుబట్టిన కారణంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. దాంతో కుంటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయని,  వివాహ బంధానికి అసలు విలువలు లేకుండా పోతున్నాయని.. చదువుకున్న వారే ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారని  ఆయన అన్నారు.  ఇలా చేయడం వల్ల  సమాజంలో కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి  అంటూ చెప్పుకొచ్చారు. తాజాగా మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఈ మనిషి అసలు ఇలా ఎలా మాట్లాడతారు? అని ఆమె ప్రశ్నించారు. ఇవి తెలివితక్కువ, వెనుకబాటుతనాన్ని సూచించే వ్యాఖ్యలని ఆమె మండిపడ్డారు.

 

బాలీవుడ్ లో ప్రముఖ హీరో అనీల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్.  ఈమె ఎన్నో సినిమాల్లో నటించి మంచి సక్సెస్ అవుతున్న సమయంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సోనమ్ కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ఎవరూ స్పందించలేదు.  కాకపోతే ఓ స్థాయిలో ఉన్నవారు వివాహ వ్యవస్థ గురించి ఇలా కామెంట్స్ చేయడం పలువురిని ప్రభావితం చేసేలా ఉంటాయని కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: