టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున వారసుడిగా మనం సినిమా క్లయిమాక్స్ లో మెరుపులా మెరిశాడు అఖిల్ అక్కినేని.  క్లయిమాక్స్ లో అక్కినేని నాగేశ్వరరావుని కాపాడే సీన్ లో అఖిల్ ఎంట్రీ దుమ్మురేపాడు.  దాంతో టాలీవుడ్ కి మరో సూపర్ అందగాడు దొరికాడు అని అక్కినేని ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు.  ఇక మాస్ దర్శకులు వివివినాయక్  దర్శకత్వంలో ‘అఖిల్’ సినిమాతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు అఖిల్ అక్కినేని.  మొదటి సినిమాలో డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్ పరంగా బాగానే ఆకట్టుకున్నా కథా పరంగా ప్రేక్షకులను మెప్పించలేకపోారు.  దాంతో మొదటి సినిమా డిజాస్టర్ టాక్ వచ్చింది.  ఆ తర్వాత హలో సినిమా తో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.. కానీ ఈ మూవీ కమర్షియల్ హిట్ సాధించలేకపోయింది. 

 

తర్వాత మిస్టర్ మజ్నుతో మరో అపజయం పొందాడు.  ఇలా వరుసగా అఖిల్ నటిస్తున్న సినిమాలు ఫెయిల్యూర్స్ కావడంతో ఆలోచనలో పడ్డారు.  ఈసారి మంచి విజయం అందుకోవాలనే కసితో ఉన్నారు. అయితే కథల విషయంలో ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా, వాటి ఫలితం మాత్రం నిరాశ పరుస్తూనే వస్తోంది.  ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' సినిమా నటిస్తున్నాడు.   ఈ సినిమాను ఏప్రిల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.  ఈ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు సిద్దమవుతున్నట్లు టాలీవుడ్ టాక్.

 

  గత ఏడాది మెగాస్టార్ చిరంజీవితో సురేందర్ రెడ్డి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకు దర్శకత్వంలో వహించిన విషయం తెలిసిందే.  ఈ మూవీ భారీ పెట్టుబడితో.. భారీ అంచనాలతో రిలీజ్ అయినప్పటికీే.. తెలుగు ప్రేక్షకుల మనసు మాత్రం దోచుకోలేకపోయింది.  అయితే సురేందర్ రెడ్డి  'సైరా' తరువాత ఆయన ఒకటి రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో అఖిల్ కి కథ వినిపించి ఓకే అనిపించుకున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: