భారతదేశం మొత్తం ఆసక్తి రేపుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఈ సినిమా భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు నిర్మాత దానయ్య. వచ్చే సంక్రాంతికి జనవరి 8న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడీ సినిమాపై ఓ షాకింగ్ న్యూస్ ఫిలింనగర్లో రౌండ్ అవుతోంది. ఈ సినిమాను కొంత భాగం రీషూట్ చేయనున్నారనే వార్త ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

 

 

గతేడాది నుంచి ఆర్ఆర్ఆర్ గురించి ఏ న్యూస్ వచ్చినా అది ఎన్టీఆర్ గురించే వస్తోందని సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పులితో ఎన్టీఆర్ ఫైట్. అరకులో షూటింగ్, భారీ ఫైట్ సీక్వెన్స్ అంటూ ఎన్టీఆర్ గురించే వార్తలు వచ్చాయి తప్ప చరణ్ గురించి పెద్దగా బజ్ క్రియేట్ చేసే న్యూస్ ఏదీ రాలేదు. ఇప్పుడీ అనుమానాలను చిరంజీవి కూడా వ్యక్తం చేశాడట. రషెష్ చూసిన చిరంజీవి చరణ్ రోల్ పై అసహనం వ్యక్తం చేశాడని అంటున్నారు. దీంతో చరణ్ క్యారెక్టర్ విషయంలో రాజమౌళి కొంతమేర వర్క్ చేసి రీషూట్ కు సిద్దమవుతున్నాడని టాక్. ప్రస్తుతానికి ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.

 

 

వాస్తవానికి రాజమౌళికి ఎవరూ సలహాలు ఇవ్వని స్టేజ్ లో ఉన్నాడు. కానీ చరణ్ విషయంలో చిరంజీవి కాంప్రమైజ్ కాడనేది కూడా తెలిసిన విషయమే. వినయ విధేయ రామ సినిమా విషయంలో చరణ్ రోల్ పై చిరంజీవి కాంప్రమైజ్ అయినందుకు ఎంత భారీ మూల్యం చెల్లించుకున్నారో తెలిసిన విషయమే. ఇప్పుడు ఏకంగా మల్టీస్టారర్ మూవీ. అందులోనూ సమఉజ్జీలు నటిస్తున్నారు. అందుకే చిరంజీవి జాగ్రత్తలు తీసుకుంటున్నాడని టాక్. మరి ఈ రీషూట్ విషయంలో నిజమెంతుంతో తెలియాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: