టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతోమంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. అలాంటి హీరోయిన్లు అతి కొద్ది మంది మాత్రమే సక్సెస్ బాటలో నడిచారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని. ఈ మూవి మంచి సక్సెస్ కావడంతో బోయపాటి- రామ్ చరణ్ కాంబినేషన్ లో ‘వినయ విధేయరామ’ సినిమాలో నటించింది. కానీ ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇక బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రిమేక్ గా షాహిద్ కపూర్ హీరోగా కైరా అద్వాని హీరోయిన్ గా తెరకెక్కిన ‘కబీర్ సింగ్ ’ సూపర్ హిట్ అయ్యింది. ధోనీ బయోపిక్ లో చేసినా సాక్షి సింగ్ ధోనీ పాత్రకు గానూ అవార్డులను అందుకుంది కైరా.
తర్వాత రియల్ లుక్స్ తో ఆకట్టుకున్న కైరా ఇప్పుడు గ్లామర్ అవతారం ఎత్తింది. ఇప్పుడు కైరా చేస్తున్నది టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు దక్కుతుంది. దాంతో ఇప్పుడు కైరా తన రెమ్యూనరేషన్ కూడా పెంచుతున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా తెరపైకి రాబోతోంది. ఈ మూవీ కోసం కియారాని చిత్ర బృందం సంప్రదించారట. రెండు కోట్లు పారితోషికం అయితేనే చేస్తానని కియారా కరాఖండీగా చెప్పినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
`అర్జున్రెడ్డి` బాలీవుడ్ రీమేక్ `కబీర్సింగ్` బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కియారా క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయిన విసయం తెలిసిందే. దాంతో తన క్రేజ్కి తగ్గట్టే రెమ్యునరేషన్ని కియారా డిమాండ్ చేస్తోంది. ఏది ఏమైనా ఈ మద్య తెలుగు లో మంచి విజయాలు అందుకున్న హీరోయిన్లు బాలీవుడ్ లో తమ అదృష్టం పరీక్షించుకోవడం.. అక్కడ హిట్ కాగానే అమాంతం తమ రెమ్యూనరేషన్ పెంచడం కామన్ అయ్యిందని అంటున్నారు సినీ విశ్లేషకులు.