తెలుగు సినిమా గురించి తెలిసిన వారికి కచ్చితంగా పరిచయం ఉండే స్టూడియో రామా నాయుడు స్టూడియో. తెలుగు చిత్ర సీమలో అగ్ర నిర్మాతగా ఉన్న రామానాయుడు స్థాపించిన ఈ స్టూడియోకి ఎంతో పేరు ఉంది. ఎన్నో సినిమాలను ఇక్కడ నిర్మించారు. ఎన్నో షూటింగ్స్ కూడా జరిగాయి. మూవీ మొఘల్ గా పేరున్న రామానాయుడు ఈ స్టూడియో నిర్మాణం కోసం, కోసం ఎంతగానో కష్టపడ్డారు కూడా. ఎన్నో భాష ల్లో సినిమాలు నిర్మించారు ఈ స్టూడియో నుంచి. దీనితో దేశ వ్యాప్తంగా ఈ స్టూడియో కి మంచి పేరు ఉంది.
రామా నాయుడు స్టూడియో పేరుతో రెండు స్టూడియో లను నిర్మించారు. వాటిల్లో ఒక స్టూడియో ఫిల్మ్ నగర్ లో ఉంది. మరో స్టూడియో నానక్ రామ్ గూడ లో నిర్మించారు. నానక్ రామ్గూడలోని రామానాయుడు స్టూడియో లో చాలా సినిమాలను నిర్మించారు. అక్కడ ఎన్నో సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయి. ఆ సినిమా ఈ సినిమా అనే తేడా లేకుండా సినిమాలు చేసిన ఈ స్టూడియో ని ఇప్పుడు తీసేస్తున్నారు అని టాక్. ఎన్నో సినిమాలకు ప్రాణం పోసిన ఈ స్టూడియో ని లేపెస్తున్నారు అంటూ ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
ప్రధాన మీడియా లో కొన్ని వార్తలు వస్తున్నాయి. దానికి కారణం ఏంటీ అంటే ప్రస్తుతం స్టూడియో వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నిర్మాత డి.సురేష్ బాబు దాన్ని meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు డెవలప్మెంట్ కోసం అమ్మేసినట్టు సమాచారం. ఈ స్టూడియో ని ప్లాట్స్ గా తయారు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు అని ప్రచారం జరుగుతుంది. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియకపోయినా ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియా లో ఎక్కువగా హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వస్తుంది అంటున్నారు.