ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీ అయ్యారు. ఇప్పుడు ఆయన వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపుగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టారు పవన్ కళ్యాణ్. వచ్చే ఏడాది మే లోపు ఈ సినిమాలు అన్నీ విడుదల కానున్నాయి. ఇంత వేగంగా వేగంగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమాలు చేయలేదు కూడా. దీనితో ఇంత వేగంగా సినిమాలు చేయడానికి కారణం ఏంటీ అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. ఇక ఇదిలా ఉంటే పవన్ తో సినిమా అనగానే ఆయన కు ఉన్న స్టార్ ఇమేజ్ తో పారితోషకం ఎక్కువగా ఉంటుంది. 

 

దీనితో దర్శక నిర్మాతలు ఆయనతో సినిమా అనగానే భారీగా ఉండే విధంగానే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు ఆయన సినిమాకు దాదాపు 20 కోట్లకు పైగానే తీసుకునే వారని అంటూ ఉంటారు. ఈ మధ్య కాలం లో ఆయన చేసిన సినిమాలు అన్నింటికీ ఇలాగే తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ట్రెండ్ మార్చారు అంటున్నారు. మహేష్ బాబుని ఫాలో అవుతున్నారని అంటున్నారు. మహేష్ బాబు ఈ మధ్య సినిమాలకు పారితోషకం తీసుకోవడం మానేశారు. 

 

సినిమాకు ముందు జరిగే మార్కెట్ మొత్తం తనకు కావాలని ఆయన డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. పింక్ సినిమా విషయంలో పవన్ కూడా అలాగే అడిగినట్టు సమాచారం. మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు ఇలాగే తీసుకున్నారు మహేష్. వాళ్ళు ఎంత ప్రచారం చేసుకుంటే అంత మార్కెట్ జరుగుతుంది. పవన్ సినిమా అంటే దాదాపు 50 నుంచి 60 కోట్ల వరకు మార్కెట్ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అలాగే తీసుకోవాలని భావిస్తున్నదని టాక్. క్రిష్ తో సినిమా కూడా అలాగే తీసుకోవాలని భావించినట్టు సమాచారం. ఇప్పుడు హీరోలు అందరూ ఇలాగే ప్లాన్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: