30 ఏళ్ల తరువాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన స్నేహితుడైన మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమాలో నటిస్తున్నారని మొన్నీమధ్య వార్తలు వచ్చాయి. దానికి కారణం సామజిక మాధ్యమాలలో మోహన్ బాబు కి సంబంధించిన ఒక పోస్ట్ వైరల్ కావడం. ఆ దుష్ప్రచారం ప్రకారం... మోహన్ బాబు చిరు సినిమాలోని విలన్ పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. అయితే దీంట్లో నిజముందో లేదో తెలుసుకోవడానికి ఒక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పాత్రికేయులు చిరంజీవి తదుపరి సినిమాని తెరకెక్కించే చిత్రయూనిట్ వద్దకు వెళ్లి ఈ విషయం గురించి అడిగారు. అయితే చిత్ర యూనిట్ మాత్రం తాము మోహన్ బాబుని అసలు కలవలేదని, తమ సినిమాలో అతడు నటించబోడని తేల్చి చెప్పేశారు.




ఇకపోతే ఈ చిత్రం కోసం హైదరాబాదులో ఒక భారీ సెట్ నిర్మించగా అక్కడ షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో చిరంజీవి ఒక ప్రొఫెసర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి 'ఆచార్య' అని టైటిల్ ని ఖరారు చేసారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి సరసన తమిళ బ్యూటీ త్రిష నటిస్తుంది. ఈ సినిమాలో అతిధి పాత్రలో రామ్ చరణ్ నటించనున్నాడగా... ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగు పూర్తి అవ్వగానే ఆచార్య షూటింగు లో పాల్గొననున్నాడు.



ఈ చిత్రంలో ఫైట్లు గట్రా అధికంగా ఉండకుండా మంచి కథా బలంతో రూపుదిద్దుకుంటుందని తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా నరసింహా రెడ్డి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. దీంతో ఈ వయసులో వయసుకు తగ్గ ఒక సినిమాలో చేసి మంచి హిట్ సాధించి తన సినీ కెరీర్ కు గుడ్ బాయ్ చెప్పబోతున్నాడు చిరంజీవి. ఏదేమైనా మోహన్ బాబు చిరు తో మళ్ళీ జత కడతారని ఫాన్స్ ఆశపడినా ఇప్పుడు అది నిజం కాదని ఆ చిత్రయూనిట్ చెప్పడం ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: