టాలీవుడ్లో భిన్నమైన కథలు ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. తనదైన నటనతో ప్రేక్షకులను ఆకర్షిస్తూ సంచలన విజయాలను సొంతం చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు... భారీ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా వసూళ్లు కూడా భారీగానే రాబట్టింది. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రష్మిక మందన నటించగా... అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కింది. కాగా  సరిలేరు నీకెవ్వరు చిత్రం ఘన విజయం అందుకున్న నేపథ్యంలో  సూపర్ స్టార్ మహేష్ బాబును ఓ జాతీయ మీడియా సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మహేష్ బాబు. 

 


 తాజాగా జాతీయ మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా రాపిడ్ ఫైర్ రౌండ్  లో అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మూడు మాటల్లో  మీ గురించి మీరు ఎలా చెబుతారు అని.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు.. హంబుల్ హంబుల్ హంబుల్ అంటూ.. తాను అనుకువ గల  వ్యక్తిని అంటూ స్పష్టం చేశారు. ఇక సినీ రంగంలో మీకు చిరస్మరణీయమైన ఘటన ఏది అని అడిగితే... మురారి చిత్రం విజయం తర్వాత తన తండ్రి సూపర్ స్టార్ తన భుజంపై చేయి వేసి అభినందించిన సంఘటన ఎప్పటికీ మర్చిపోలేనని  అంటూ సూపర్ స్టార్  తెలిపారు. మీ లైఫ్ లో మంచి మధురమైన రొమాంటిక్ క్షణాలు  ఏవి అన్న ప్రశ్నకు... ఓ మంచి సినిమాను తన భార్యతో కలిసి చూడడమే తనకు మధురమైన రొమాంటిక్ క్షణాలు అంటూ మహేష్ బాబు తెలిపారు.

 


 ఇక మరో ప్రశ్నకు సమాధానమిస్తూ నిజాయితీ లేని వ్యక్తులు అంటే తనకు అస్సలు నచ్చదు అంటూ స్పష్టం చేశారు మహేష్ బాబు. ఒకవేళ మీ బయోపిక్ తీస్తే ఎవరు నటిస్తే బాగుంటుంది అన్న ప్రశ్నకు... తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు మహేష్ బాబు. నాది  చాలా సాధారణమైన జీవితం అని బయోపిక్ తీసేంతగా తన జీవితంలో ఎలాంటి మలుపులు లేవని.. అంతా బోరింగ్ అంటూ సమాధానం చెప్పాడు మహేష్ బాబు. తన కెరీర్ మొదట్లో తన కోసం ఓ అభిమాని రక్తంతో లేఖ రాయడాన్ని చూసి ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాను  అంటూ మహేష్ బాబు అన్నారు . ఓ రోడ్డు ట్రిప్పులో ముగ్గురితో ప్రయాణించాల్సి వస్తే తారక్ చరణ్ లను  ఎంచుకుంటాను అంటూ మహేష్ బాబు తెలిపారు.. సమతూకంగా ఉండేందుకు మెగాస్టార్ చిరంజీవి గారి పేరు కూడా చెబుతాను అంటూ చిలిపి నవ్వు నవ్వేశారు మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: