టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇటీవల వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఆ సినిమాకు యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకర దానిని నిర్మించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఫ్యామిలితో కలిసి విదేశాల్లో హ్యాపీగా టూర్ లో ఎంజాయ్ చేస్తున్న మహేష్, వచ్చే నెలలో ఇండియాకి రానున్నారు. ఇక మహేష్ బాబు చరిష్మా, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మహేష్ కు సరైన కమర్షియల్ సినిమా పడితే ఎలా ఉంటుందో మొన్న వచ్చిన సరిలేరు నిరూపించింది. మహేష్ బాబుకు ఎక్కువగా లేడీస్ లో ఫాలోయింగ్ క్రేజ్ ఎక్కువ. మన టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఎంతో అందగాడైన మహేష్ బాబు ఇప్పటివరకు తెలుగులో తప్పించి మరొక భాషలో నటించనే లేదు. 

 

పలు మార్లు ఆయనకు బాలీవుడ్ అవకాశాలు వచ్చినప్పటికీ ఆయన నటించడానికి ఇష్టపడలేదు. ఇక మధ్యలో ఆయన సినిమాలు కొన్ని హిందీలో డబ్ కాబడి యూట్యూబ్ లో మంచి వ్యూస్ దక్కించుకుంటున్నాయి. కొన్నేళ్ల క్రితం మొదట థమ్స్ అప్ కు బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న మహేష్ బాబు, అప్పట్లో తన క్రేజ్ తో, అటు సౌత్ లోని ఇతర భాషలతో పాటు నార్త్ వారిని కూడా ఎంతో ఆకర్షించారు. ఇక ఇటీవల కొన్నేళ్ల క్రితం నుండి ఇండియా వైడ్ గా జరుగుతున్న మోస్ట్ డిజైరబుల్ మెన్ కాంటెస్ట్ లో మహేష్ బాబు సృష్టించిన సంచలనాలు అన్ని, ఇన్ని కావు అనే చెప్పాలి. ముందుగా 2010 లిస్ట్ లో 12వ స్థానంలో ఉన్న సూపర్ స్టార్, ఆ తరువాత 2011లో 5వ స్థానానికి, అలానే 2012లో 2వ స్థానానికి, ఇక 2013లో ఏకంగా నార్త్, సౌత్ నటులను అందరిని తలదన్ని ఏకంగా మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. 

 

అయితే ఆ తరువాత 3, 6 స్థానాలు సహా, ఇటీవల కొంత వెనకబడ్డ మహేష్, గత ఏడాది నుండి ఫరెవర్ డిజైరబుల్ మ్యాన్ అనే గొప్ప ఖ్యాతిని గడించారు. నిజానికి దేశవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరున్న నటులకు లక్షలాది మంది ప్రజలు అందించే ఈ ఓటింగ్స్ లో మన సూపర్ స్టార్ కు ఇంత అరుదైన గురవం దక్కడం, అలానే ఒక్క బాలీవుడ్ సినిమా కూడా చేయకుండా మహేష్ ఇంతటి గొప్ప స్థాయిని అందుకోవడంతో అక్కడి అగ్ర నటులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. నిజనికి మహేష్ సై అంటే చాలు బాలీవుడ్ బడా దర్శకులు ఎందరో ఆయనతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆయన మాత్రం తన ఆఖరి శ్వాస వరకు తెలుగులోనే నటిస్తానని ఇటీవల చెప్పడం జరిగింది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: