గత కొంత కాలంగా వరస పరాజయాలను చవి చూసిన యంగ్ హీరో నితిన్, భీష్మ తో మరోసారి తన అదృష్టాన్ని  పరీక్షించుకోవడానికి రెడీ అయ్యాడు. అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 21న విడుదలకానుంది. ఈచిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యు సర్టిఫికేట్ ఇవ్వగా 140నిమిషాల నిడివి తో ప్రేక్షకులముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా విడుదలైన ఈసినిమా ట్రైలర్ డీసెంట్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. 
 

ఇదిలావుంటే  విడుదలకు ముందే ఈ చిత్రం నిర్మాత కు  మంచి లాభాలను తెచ్చిపెటింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలుపుకొని భీష్మ 32కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా 23కోట్ల బడ్జెట్ పెట్టారు దాంతో నిర్మాతకు 9కోట్లు లాభం వచ్చింది. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 

 

ఇక నితిన్ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా వున్నాడు. అందులో తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రంగ్ దే ఒకటి. ఈసినిమాను కూడా  సితార ఎంటర్ టైన్మెంట్సే నిర్మిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు నితిన్ ,సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో చెక్ అనే సినిమా చేస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నితిన్  ఖైది గా కనిపించనున్నాడు. ఈరెండు సినిమాలు కూడా ఈ ఏడాదే ప్రేక్షకులముందుకు రానున్నాయి. ఈచిత్రాల తరువాత నితిన్ , అంధధూన్ రీమేక్ తోపాటు కృష్ణ చైతన్య డైరెక్షన్ లో పవర్ పేట లో నటించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: