సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు తర్వాత మరోసారి వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ప్రస్తుతం హాలీడే మూడ్ లో ఉన్న మహేష్ అవి పూర్తిచేసుకుని రాగానే వంశీ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడని అంటున్నారు. ఇదిలాఉంటే ఈ మూవీ తర్వాత అసలైతే రాజమౌళితో మహేష్ సినిమా ఉంటుందని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా రాజమౌళి మహేష్, ప్రభాస్ తో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు.

 

ఇవన్ని ఒక ఎత్తైతే ఇప్పుడు మహేష్ తో కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీకి సిద్ధమైనట్టు తెలుస్తుంది. కొన్నాళ్లుగా సూపర్ స్టార్ మహేష్ తో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సినిమా ప్రయత్నాల్లో ఉన్నారు. మహేష్ కూడా అల్లు అరవింద్ కు డేట్స్ ఇచ్చారట. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 2 పూర్తి కాగానే మహేష్ సినిమా పట్టాలెక్కిస్తారట. కెజిఎఫ్ 2 కూడా అనుకున్న విధంగా సక్సెస్ అయితే మహేష్ ప్రశాంత్ నీల్ కు ఛాన్స్ ఇవ్వడం కన్ ఫాం అవుతుంది.

 

అలా మెగా ప్రొడ్యూసర్ మొదటిసారిగా మహేష్ బాబుతో చేసే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికి బాలీవుడ్ నుండి ఆఫర్లు వస్తున్నా ఇంకా తను తెలుగులోనే చాలా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్న మహేష్ ను ఇలాగైనా సరే బాలీవుడ్ తీసుకెళ్తే బెటర్ అంటున్నారు ఆయన ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ తో మహేష్ మూవీ అల్లు అరవింద్ వేసిన ఈ స్కెచ్ కు మిగతా హీరోలకు సౌండ్ లేకుండా చేస్తుంది. మరి ఈ కాంబో సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. తప్పకుండా ఈ మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో ఉంటుందని ఘట్టమనేని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: