మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్‌, పూజాహెగ్డే క‌లిసి జంట‌గా న‌టించిన చిత్రం `అల వైకుంఠ‌పురంలో` విజ‌యంతో ఫుల్ స‌క్సెస్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం అల్లుఅర్జున్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌తో క‌లిసి న‌టిస్తున్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రాబోయే మూడ‌వ చిత్ర‌మిది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఆర్య‌, ఆర్య‌2 చిత్రాలు ఎంత సూప‌ర్ స‌క్సెస్ అయ్యాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే వీరి తాజా చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.  కొన్ని అనివార్య కారణాల వలన ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. దానికి కార‌ణాలు లేక‌పోలేదు. ఇదివరకే హీరో లేకుండానే ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ కొంత వ‌ర‌కు జరుపుకున్నారు.

 


ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారని స‌మాచారం. అందుకు గాను విజయ్ సేతుపతికి భారీ పారితోషకం ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రంలో రంగమత్త కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుందట. అయితే రంగస్థలంలో ఒక చక్కటి పాత్రను పోషించిన‌ అనసూయ కోసం సిద్ధం చేసిన సుకుమార్, ఈ చిత్రంలో కూడా మరొక చక్కటి పాత్రని రెడీ చేశారని సమాచారం. కాకపోతే ఈ చిత్రంలో అనసూయ పాత్ర నెగిటివ్ కోణంలో ఉండనుంద‌ట‌. ఇకపోతే ఈ చిత్రాన్ని మొదటగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామనుకున్నారు కానీ అదే సమయానికి రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఆర్‌.ఆర్‌.ఆర్‌.చిత్రం రానుండటంతో ఇప్పుడు మరో మంచి విడుదల తేదీ కోసం వెతికే పనిలో పడ్డారు దర్శకనిర్మాతలు. మ‌రి రాజ‌మౌళితో ఢీ కొట్ట‌డ‌మంటే మాములు విష‌యం కాదుగా అందులోను మ‌ల్టీస్టార‌ర్‌గా తెరెకెక్కుతున్న ఆ చిత్రానికి కాస్త ఇంపార్టెన్స్ ఎక్కువ‌గానే ఉంటుంది మ‌రి.

 

ఇక ఈ చిత్ర క‌థాంశం ఏంటి అన్న‌ది ఇంకా తెలియాల్సి ఉంది. మ‌రి సుకుమార్  బ‌న్నీని ఎలా చూపింస్టారు ఏంటి అన్న‌ది తెలియాల్సి ఉంది. అలాగే ఈ చిత్రంలో క‌థానాయిక ఎవ‌రు అన్న‌ది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. బ‌న్నీకి అల స‌క్సెస్‌తో పాటు ఈ చిత్రం కూడా స‌క్సెస్ వ‌చ్చిందంటే గ‌నుక మ‌ళ్ళీ ట్రాక్‌లో ప‌డ్డ‌ట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: