ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ చాలా గ్యాప్ త‌ర్వాత పింక్ రీమేక్ చిత్రంతో ఎంట్రీ ఇవ్వ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఓ ప‌క్క రాజ‌కియాల‌తో బిజీగా ఉంటూనే మ‌రోప‌క్క సినిమాల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌నవి రెండు చిత్రాలు ఒకేసారి తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఒక‌టి పింక్ రీమేక్ దిల్‌రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుంటే మ‌రో చిత్రం క్రిష్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోంది. ఈ రెండు చిత్రాల చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఒక పీరియాడికల్ చిత్ర షూటింగ్ లో నిర్విరామంగా పాల్గొననున్నారని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబందించిన ఒక లేటెస్ట్ వార్త ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైరల్ అవుతుంది.

 


అయితే అదేమిటంటే...ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారని సమాచారం.  అందులో ఒక హీరోయిన్ గా భూమిక మెరవనుందని సమాచారం. గ‌త‌ కొంత కాలం గ్యాప్ తరువాత ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తున్న భూమిక ఇప్పుడు మరొకసారి పవన్ కళ్యాణ్ తో హీరోయిన్ గా కనిపించనుంది. అయితే గతంలో సంచలనం సృష్టించిన ఖుషీ చిత్రంలో సిద్దూ, మధుమతిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన ఈ జంట మళ్ళీ ఎలా అలరించనుంది అనేది చర్చనీయాంశంగా మారింది. ఇటీవ‌లె భూమిక బాల‌కృష్ణ న‌టించిన రూర‌ల్ చిత్రంలో కూడా ఒక ప్ర‌త్యేక పాత్ర‌ను పోషించిన విష‌యం తెలిసిందే. మ‌రి ప‌వ‌న్‌తో మ‌ళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం అందులోనూ వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఖుషీ సూప‌ర్‌డూప‌ర్ హిట్ కావ‌డం విశేషంగా చెప్పుకోవ‌చ్చు. దాదాపు ప‌దేళ్ళ త‌ర్వాత మ‌ళ్ళీ వీరిద్ద‌రిని జంట‌గా తెర‌మీద చూడ‌డం పై ప్రేక్ష‌కులు ఎంత థ్రిల్ ఫీల‌వుతారు ఏంటి అన్న‌ది తెలియాల్సి ఉంది. 

 

ప్ర‌స్తుతం ప‌వ‌న్ ఈ రెండు చిత్రాల్లో న‌టించ‌డ‌మే కాక మ‌రో ఐదు సినిమాల‌కు సంత‌కం పెట్టిన విషయం తెలిసిందే. ఆయ‌న ఒక‌దాని వెనుక మ‌రొక‌టి ప్లాన్ చేసుకుంటూ ఈ సంవ‌త్స‌రంలో ఆయ‌న నుంచి దాదాపు ఆరు చిత్రాలు పైగా వ‌చ్చేలా చేస్తున్నారు. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి ఇక మాములు పండ‌గ కాదు. అలాగే స‌క్సెస్ ఫెయిల్యూర్స్‌కి సంబంధం లేకుండా ప‌వ‌న్ సినిమాల‌కు క‌లెక్ష‌న్లు ఉంటాయి. అందుకే ప‌వ‌న్‌తో సినిమాలు తీయ‌డానికి నిర్మాత‌లు ఇంట్రెస్ట్ చూపిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: