టాలీవుడ్ లో హిట్ ఫ్లాప్ అనే తేడా లేకుండా సినిమాలు చేస్తూ వెళ్ళే హీరోల్లో నితిన్ ముందు వరుసలో ఉంటాడు. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు ఈ యంగ్ హీరో. ఇక ప్రస్తుతం భీష్మ అనే లవ్ స్టొరీ తో వస్తున్నాడు ప్రేక్షకుల ముందుకి. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో చాలా వేగంగా పాల్గొంటూ తన సినిమా విశేషాలను ప్రేక్షకులకు వివరిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో చేసింది చిత్ర యూనిట్. 

 

దీనికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన త్రివిక్రమ్... కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సినిమా హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేసాడు. ముందుగా ఈ చిత్ర హీరో నితిన్‌కు వాళ్ల అన్నయ్య పవన్ కళ్యాణ్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రసంగం మొదలుపెట్టాడు. ఆయన తరుపున, ఆయన అభిమానులందరి తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నానన్నాడు.

 

ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా తాను చూసా అని, సినిమా చాలా బాగుందన్నాడు. 21న అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నాడు. నమ్మకంగా చెబుతున్నానన్నాడు త్రివిక్రమ్. ఇక హీరోయిన్ గురించి మాట్లాడుతూ రష్మిక మంచి సక్సెస్ వేవ్‌లో ఉందని...  ‘సరిలేరు నీకెవ్వరు’ ఆ తర్వాత ‘భీష్మ’.. అదే సక్సెస్ కంటిన్యూ చేయాలని ఆకాంక్షించాడు. నీకు మరెన్నో విజయాలు రావాలని అన్నాడు ఈ స్టార్ దర్శకుడు. బెంగళూరు నుంచి ఇక్కడకు 50 నిమిషాలే ప్రయాణమని... సో, వర్రీ అవ్వవద్దు. మీరెప్పుడు మాకు దగ్గరగానే ఉంటారన్నాడు. ఈ సినిమా పక్కా హిట్ అని, అందరూ పార్టీకి రెడీ గా ఉండాలన్నాడు. కాగా ఈ సినిమాని సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తుండగా, శివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: