త్రివిక్రమ్ తన కెరీర్ లో సినిమా చేసి ఇబ్బంది పడింది ఏది అయినా ఉందీ అంటే 2018 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన అజ్ఞాతవాసి సినిమా. పవన్ కళ్యాణ్ హీరోగా హారిక అండ్ హాసిని బ్యానర్ పై వచ్చిన ఆ సినిమా ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు. అంటే ఒక దర్శకుడికి హిట్ ఫ్లాప్ లు సాధారణమే గాని పాపం ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్ పడిన మాటలు అన్నీ ఇన్నీ కాదనే చెప్పాలి. కులాలను కూడా ప్రస్తావించి త్రివిక్రమ్ ని అమ్మ నా బూతులు తిట్టారు పవన్ ఫాన్స్. మనిషి అన్న వాడికి బాధ ఉంటుంది. 

 

అది ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే సర్వ సాధారణ విషయం. దీనితో త్రివిక్రమ్ ఆ తర్వాత తన జీవితంలో ఎప్పుడు కూడా పవన్ తో సినిమా చేయను అని చెప్పేసాడు. అసలు పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా చేస్తే త్రివిక్రమ్ తోనే ఉంటుంది అనుకున్నారు అందరూ. కాని త్రివిక్రమ్ మాత్రం అందుకు నో చెప్పేసాడు. అయితే ఇప్పుడు మాత్రం అతను మళ్ళీ సినిమా చెయ్యాలని భావిస్తున్నాడని అంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. 

 

సినిమా తర్వాత ఏ సినిమాను ఒప్పుకోలేదు. పవన్ కళ్యాణ్ క్రిష్, హరీష్ శంకర్ తో ఒక సినిమా ఓకే అన్నాడు. ఆ సినిమా తర్వాత ఏ సినిమా చెప్పలేదు. అవి షూటింగ్ కూడా మొదలయ్యే దశలో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరు వచ్చే ఏడాది సినిమాకు ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. అందుకే త్రివిక్రమ్ ఇప్పుడు పవన్ ఫాన్స్ కి దగ్గర కావాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నాడు. అందుకే భీష్మా సినిమా ఆడియో కార్యక్రమంలో పవన్ పేరు, అతని ఫాన్స్ ని ప్రస్తావించాడు. ఇక అల వైకుంఠపురములో సినిమా ముందు కూడా పవన్ ని కలిసాడు. ఆ తర్వాత పవన్ కూడా  బన్నీ పై ట్వీట్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: