‘కుమారి 21 ఎఫ్’ విడుదల తరువాత అప్పట్లో యూత్ కు క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన హెబ్బా పటేల్ రేంజ్ చూసి చాలమంది ఆమె టాప్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళిపోతుంది అని భావించారు. అయితే ఆ తరువాత ఆమె నటించిన సినిమాలు అన్నీ వరస ఫ్లాప్ లుగా మారడంతో ప్రస్తుతం ఆమెకు కనీసపు అవకాశాలు కూడ ఇవ్వడం లేదు. 


ఇలాంటి పరిస్థితులలో ఈమె ఈ వారం విడుదల కాబోతున్న ‘భీష్మ’ మూవీలో ఆ మూవీ కథకు ఒక మలుపు తిప్పే ఒక ప్రత్యేక పాత్రలో నటించింది అని వార్తలు వస్తున్నాయి. ఆమె పాత్ర కేవలం 15 నిముషాలు మాత్రమే ఉన్నా ఖచ్చితంగా ఆమె పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అయి తీరుతారు అని అంటున్నారు. 


అయితే ఈ పాత్ర గురించి ఈ మూవీ యూనిట్ వర్గాలు కానీ అదేవిధంగా హెబ్బా పటేల్ కాని ఇప్పటి వరకు ఓపెన్ గా స్పందించ లేదు. దీనితో ఈ విషయంలో ఎందుకు ఇలాంటి సస్పెన్స్ కొనసాగిస్తున్నారు అన్న సందేహాలు కూడ వస్తున్నాయి. నిన్న జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడ ఆమె రావడం జరగలేదు. 


వాస్తవానికి ఈ మూవీ క్రేజ్ అంతా రష్మిక పై నడుస్తున్న పరిస్థితులలో ఇప్పుడు పూర్తిగా ఫైడ్ అయిపోయిన హెబ్బా ను ఎందుకు మళ్ళీ లైమ్ లైట్ లోకి తీసుకు వస్తున్నారు అన్న విషయమై క్లారిటీ లేకపోయినా ఆమెకు ‘భీష్మ’ మరో టర్నింగ్ ఇచ్చే ఆస్కారం ఉంది. ముఖ్యంగా ‘కుమారి 21ఎఫ్’ లో హెబ్బా పటేల్ ప్రదర్శించిన చలాకీతనం కవ్వింపు నటన ఆ మూవీకి హైలెట్ గా మారిన విషయం ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. దర్శకుడు వెంకీ కుడుముల ఒకప్పుడు రష్మిక కు ‘ఛలో’ లో ఛాన్స్ ఇచ్చి ఆమెను క్రేజీ హీరోయిన్ గా మార్చినట్లుగా ఇప్పుడు హెబ్బా కు ఈ దర్శకుడు మరొకసారి లైఫ్ ఇవ్వబోతున్నాడు అనుకోవాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: