ఛలో సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన భామ రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస విజయాలతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ ని తెచ్చుకుంది. ప్రస్తుతం రష్మిక కోసం నిర్మాతలంతా ఎగబడుతున్నారు. మొన్నటికి మొన్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి విజయం అందుకున్న ఈ భామ ప్రస్తుతం "భీష్మ" అనే సినిమాతో మన ముందుకి వస్తుంది. నితిన్ హీరోగా చేస్తున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రానుంది.

 

 

 

అయితే ప్రస్తుతం రష్మిక గురించి సోషల్ మీడియాలో ఒకటే చర్చ నడుస్తుంది. నితిన్, రష్మిక కలిసి భీష్మ ప్రమోషన్లలో భాగంగా ఒకానొక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ నోరు జారి రష్మిక కుక్క బిస్కెట్లు తింటుందని చెప్పడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక అప్పటి నుండి నెటిజన్లు రష్మికను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. హీరోయిన్ అయి ఉండి కుక్క బిస్కెట్లు తినడం ఏంటి? మనుషులు తినే బిస్కెట్లు కొన్కుక్కోలేవా? అయినా అన్ని డబ్బులు లేవా? అయినా ఇదేం అలవాటు? అంటూ వరుసగా నెటిజనులు ట్రోల్ చేసారు. 

 

 

ఇప్పటికీ కుక్క బిస్కెట్ లతో ఉన్న రష్మిక ఫోటోని వైరల్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఒకానొక ఇంటర్వ్యూలో ఈ కుక్క బిస్కెట్ల గురించి అడగగా..సిగ్గుపడుతూ రష్మిక ఈ విధంగా సమాధానమిచ్చింది. నేను కేవలం ఒక్కసారి మాత్రమే వాటిని తిన్నా..అది కూడా ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని.. అలా తినడం నితిన్ చూసాడు. చూస్తే చూశాడు కానీ ఇలా అందరికీ చెప్తాడని అనుకోలేదు.

 

 


మీడియాకి తెలిసిన తర్వాతైనా ఇంతలా రచ్చ జరుగుతుందని అనుకోలేదు. నాకు కొన్ని విషయాల గురించి తెలుసుకోవాలనే ఆత్రం ఎక్కువగా ఉంటుంది. ఆ ఆత్రంలో భాగమే కుక్క బిస్కెట్లు టేస్ట్ చేసాను. ఇప్పటికైనా ఈ విషయం మీద ట్రోల్ చేయడం ఆపేయండి.. మళ్ళీ ఆ కుక్క బిస్కెట్ల జోలికి వెళ్ళను అని చెప్పింది. అంతా అయిపోయి జరగాల్సిన డ్యామేజి జరిగాక ఇప్పుడు అని మాత్రం ఏం లాభం అని చెవులు కొరుక్కుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: